Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ రచయిత భూపతిరాజాకు పితృవియోగం

Webdunia
సోమవారం, 16 జనవరి 2023 (09:04 IST)
ప్రముఖ సినీ రచయిత బాలమురుగన్ కన్నుమూశారు. ఈయనకు వయసు 86 యేళ్లు. తెలుగులో ప్రముఖ మాటల రచయితగా గుర్తింపు పొందిన భూపతి రాజా తండ్రే ఈ బాలమురుగన్. ఈయన కూడా తెలుగు, తమిళ సినిమాలకు పని చేశారు. తెలుగులో గీతా ఆర్ట్స్ నిర్మించిన తొలి సినిమాకు కథను సమకూర్చారు. 
 
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన తెలుగు, తమిళం సహా పలు భాషల్లో అనేక సినిమాలకు రచయితగా పని చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం చెన్నైలోని రాజా అన్నామలైపురంలో ఉన్న ఆయన నివాసంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని కుమారుడు, మాటల రచయిత భూపతిరాజా తెలిపారు. 
 
బాలమురుగన్ తెలుగులో ధర్మదాత, సోగ్గాడు, ఆలుమగలు, సావాసగాళ్లు, జీవనతరంగాలు వంటి అనేక హిట్ చిత్రాలకు కథను అందించారు. గీతా ఆర్ట్స్ తొలిసారి నిర్మించిన "బంట్రోతు భార్య" సినిమాకు ఆయనే కథను సమకూర్చారు. తమిళ దిగ్గజ నటుడు శివాజీ గణేశన్‌కు దాదాపు 40కిపైగా చిత్రాలకు కథలను అందించారు. బాలమురుగన్ మరణవార్త తెలుసుకున్న తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి మండపంలో అనుకోని అతిథిలా చిరుతపులి ... బెంబేలెత్తిపోయిన చుట్టాలు (Video)

Valentines Day: ప్రేమోన్మాది ఘాతుకం- యువతి తలపై కత్తితో పొడిచి.. ముఖంపై యాసిడ్ పోశాడు

ప్రేమికుల దినోత్సవం రోజున అమానుషం.. యువతిపై యాసిడ్ పోసి కత్తితో దాడి (Video)

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్.. టీడీపీ కండువా కప్పుకున్న ఆళ్ల నాని

Vallabhaneni Vamsi: వైసీపీ నేత వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments