Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ రచయిత భూపతిరాజాకు పితృవియోగం

Webdunia
సోమవారం, 16 జనవరి 2023 (09:04 IST)
ప్రముఖ సినీ రచయిత బాలమురుగన్ కన్నుమూశారు. ఈయనకు వయసు 86 యేళ్లు. తెలుగులో ప్రముఖ మాటల రచయితగా గుర్తింపు పొందిన భూపతి రాజా తండ్రే ఈ బాలమురుగన్. ఈయన కూడా తెలుగు, తమిళ సినిమాలకు పని చేశారు. తెలుగులో గీతా ఆర్ట్స్ నిర్మించిన తొలి సినిమాకు కథను సమకూర్చారు. 
 
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన తెలుగు, తమిళం సహా పలు భాషల్లో అనేక సినిమాలకు రచయితగా పని చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం చెన్నైలోని రాజా అన్నామలైపురంలో ఉన్న ఆయన నివాసంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని కుమారుడు, మాటల రచయిత భూపతిరాజా తెలిపారు. 
 
బాలమురుగన్ తెలుగులో ధర్మదాత, సోగ్గాడు, ఆలుమగలు, సావాసగాళ్లు, జీవనతరంగాలు వంటి అనేక హిట్ చిత్రాలకు కథను అందించారు. గీతా ఆర్ట్స్ తొలిసారి నిర్మించిన "బంట్రోతు భార్య" సినిమాకు ఆయనే కథను సమకూర్చారు. తమిళ దిగ్గజ నటుడు శివాజీ గణేశన్‌కు దాదాపు 40కిపైగా చిత్రాలకు కథలను అందించారు. బాలమురుగన్ మరణవార్త తెలుసుకున్న తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె.. పరువు పోయిందని తండ్రి ఆత్మహత్య

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments