Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ రచయిత భూపతిరాజాకు పితృవియోగం

Webdunia
సోమవారం, 16 జనవరి 2023 (09:04 IST)
ప్రముఖ సినీ రచయిత బాలమురుగన్ కన్నుమూశారు. ఈయనకు వయసు 86 యేళ్లు. తెలుగులో ప్రముఖ మాటల రచయితగా గుర్తింపు పొందిన భూపతి రాజా తండ్రే ఈ బాలమురుగన్. ఈయన కూడా తెలుగు, తమిళ సినిమాలకు పని చేశారు. తెలుగులో గీతా ఆర్ట్స్ నిర్మించిన తొలి సినిమాకు కథను సమకూర్చారు. 
 
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన తెలుగు, తమిళం సహా పలు భాషల్లో అనేక సినిమాలకు రచయితగా పని చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం చెన్నైలోని రాజా అన్నామలైపురంలో ఉన్న ఆయన నివాసంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని కుమారుడు, మాటల రచయిత భూపతిరాజా తెలిపారు. 
 
బాలమురుగన్ తెలుగులో ధర్మదాత, సోగ్గాడు, ఆలుమగలు, సావాసగాళ్లు, జీవనతరంగాలు వంటి అనేక హిట్ చిత్రాలకు కథను అందించారు. గీతా ఆర్ట్స్ తొలిసారి నిర్మించిన "బంట్రోతు భార్య" సినిమాకు ఆయనే కథను సమకూర్చారు. తమిళ దిగ్గజ నటుడు శివాజీ గణేశన్‌కు దాదాపు 40కిపైగా చిత్రాలకు కథలను అందించారు. బాలమురుగన్ మరణవార్త తెలుసుకున్న తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments