Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌'తో పూజా హెగ్డే

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (10:55 IST)
తెలుగులో వరుస హిట్లు సాధిస్తూ కెరీర్‌ను మూడు పువ్వులు, ఆరు కాయలుగా మలుచుకుంటున్న హీరోయిన్ పూజా హెగ్డే. లాక్డౌన్ సమయంలో ఈ భామ పూర్తిగా ఇంటికే పరిమితమైపోయి.. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడిపింది. ఇపుడు అన్‌లాక్-4లో సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వడంతో అనేక మంది నిర్మాతలు ఆగిపోయిన తమ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వాటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ఒకటి. అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు, వాసువర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. 
 
ఇపుడు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభంకావడంతో ఈ అమ్మడు తన వ్యక్తిగత మేకప్ సిబ్బందితో కలిసి షూటింగ్ స్పాట్‌కు వచ్చింది. తాజాగా మంగళవారం నుంచి చిత్రబృందం తిరిగి షూటింగ్‌ను మొదలుపెట్టింది. హైదరాబాద్‌లో అఖిల్‌ అక్కినేని, పూజాహెగ్డేలపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. వ్యానిటీ వ్యాన్‌ ముందు నిల్చొని చిరునవ్వులు చిందిస్తున్న ఆన్‌లొకేషన్‌ స్టిల్‌ను సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో ఆమె షేర్ చేసుకుంది. పూజాహెగ్డే పోస్ట్‌ చేసిన ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ పూర్తికానున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments