Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ముద్రను చెరిపేసిన హీరోను తక్కువ చేసి మాట్లాడిన జిగేల్ రాణి (video)

Webdunia
మంగళవారం, 24 నవంబరు 2020 (13:14 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఈమె ఇటీవలి కాలంలో పలు వివాదాల్లో చిక్కుకుంటుంది. గతంలో తనకు స్టార్ ఇమేజ్‌ను కల్పించిన టాలీవుడ్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడింది. ఇపుడు తనకు లైఫ్ ఇచ్చిన హీరో ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా, ఫ్లాప్ హీరోయిన్ ముద్రను చెరిపేసిన హీరో కాదనీ, మరో హీరోపై పొగడ్తల వర్షం కురిపించింది. దీంతో హీరో అభిమానులు జిగేల్ రాణిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ హీరోలు ఎవరో కాదు.. ఒకరు అల్లు అర్జున్ అయితే, మరొకరు జూనయిర్ ఎన్టీఆర్. ఇందులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీగా ఉంటే.. బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలు ఏంటో ఓసారి తెలుసుకుందాం. 
 
పూజా హెగ్డే తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. టాలీవుడ్‌ ప్రేక్షకులను కించపరిచేలా మాట్లాడింది. దీంతో ఆమెపై ఒక్కసారిగా వ్యతిరేకత రావడంతో వెంటనే.. తన టీమ్‌తో ఓ లెటర్‌ని విడుదల చేయించింది. అయితే అంత వివాదం జరిగినా.. ఒక్క ట్వీట్‌ కూడా చేయని పూజా హెగ్డే.. టీమ్‌తో లెటర్‌ విడుదల చేయించిన తర్వాత కూడా స్పందించలేదు. 
 
ఇక మళ్లీ ఆమె అటువంటి వివాదంలోనే చిక్కుకుంది. అదేంటంటే.. రీసెంట్‌గా ఆమె 'అరవింద సమేత' సినిమా గురించి ప్రస్తావిస్తూ.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ని పొగడ్తలతో ముంచేసింది. తారక్‌ తన ఎనర్జీకి మ్యాచ్‌ చేయగలిగే రేంజ్‌లో ఉంటాడని, అతనితో కలిసి నటించడం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చిందని చెప్పుకొచ్చింది. 
 
దీంతో.. అసలామె ప్లాప్‌ హీరోయిన్‌గా పడిన ముద్రని చెరిపేసిన అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ హర్టయ్యారు. డీజేతో బ్రేక్‌ ఇచ్చింది బన్నీ.. అలాగే "అల వైకుంఠపురములో" అనే చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చింది బన్నీ. కానీ బన్నీ గురించి చెప్పకుండా.. నా స్థాయికి ఎన్టీఆర్‌ బెటర్‌ అన్నట్లుగా ఆమె మాట్లాడటంతో.. బన్నీ ఫ్యాన్స్‌ ఆమెపై అలక వహించారు. ఈ విషయమే హైలెట్‌ చేస్తూ.. సోషల్‌ మీడియాలో ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. మరి దీనిపైనైనా ఆమె స్పందిస్తుందో.. లేదంటే.. లైట్‌ తీసుకుంటుందో చూద్దాం.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

చిన్న విషయాలకే భర్త వేధింపులు.. చీరతో ఉరేసుకుని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments