Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ వాడకండి.. మరో నెట్‌వర్క్‌కు మారండి... పూజా హెగ్డే పిలుపు

Webdunia
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (11:04 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస ఆఫర్లతో దూసుకెళుతున్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఈమె తాజాగా ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేనా.. 'ఎయిర్‌టెల్‌ వాడకండి.. మరో నెట్‌వర్క్‌కు మారండి' అంటూ ఆ సంస్థకు వ్యతిరేకంగా పిలుపునిచ్చింది. 
 
వినియోగదారుల సేవల విషయంలో ఆ సంస్థ సరిగ్గా స్పందించడం లేదని, పదే పదే సమస్య వస్తోందని, అందువల్ల ఎయిర్‌‌టెల్ మొబైల్ వినియోగదారులంతా ఇతర నెట్‌వర్క్‌కు మారాలని ఆమె పిలుపునిచ్చారు. ముఖ్యంగా, ఎయిర్‌టెల్ నుంచి ఇతర టెలీకాం సంస్థకు చెందిన సిమ్‌ వాడి సమయాన్ని సేవ్ చేసుకోవాలని ఆమె సామాజిక మాధ్యమం ద్వారా అభిమానులకు సూచన చేసింది. 
 
దీంతో వెంటనే స్పందించిన ఎయిర్‌టెల్ ప్రతినిధులు... ఆమెను సంప్రదించారు. పూజా హెగ్డేకు ఎదురవుతోన్న తమ సర్వీసు సమస్యలన్నీ పరిష్కరించారు. 'హాయ్ పూజా.. మీకు కలిగిన సేవల అంతరాయం పట్ల క్షమాపణలు చెబుతున్నాం. మీకు ఎదురవుతున్న సమస్య ఇప్పుడు పరిష్కారం అయిందని భావిస్తున్నాం' అని ఎయిర్‌టెల్ ఇండియా విభాగం ఓ ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

Roja: ఆడుదాం ఆంధ్ర కుంభకోణం.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

కన్నబిడ్డ నామకరణానికి ఏర్పాట్లు... అంతలోనే తండ్రి హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments