Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ వాడకండి.. మరో నెట్‌వర్క్‌కు మారండి... పూజా హెగ్డే పిలుపు

Webdunia
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (11:04 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస ఆఫర్లతో దూసుకెళుతున్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఈమె తాజాగా ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేనా.. 'ఎయిర్‌టెల్‌ వాడకండి.. మరో నెట్‌వర్క్‌కు మారండి' అంటూ ఆ సంస్థకు వ్యతిరేకంగా పిలుపునిచ్చింది. 
 
వినియోగదారుల సేవల విషయంలో ఆ సంస్థ సరిగ్గా స్పందించడం లేదని, పదే పదే సమస్య వస్తోందని, అందువల్ల ఎయిర్‌‌టెల్ మొబైల్ వినియోగదారులంతా ఇతర నెట్‌వర్క్‌కు మారాలని ఆమె పిలుపునిచ్చారు. ముఖ్యంగా, ఎయిర్‌టెల్ నుంచి ఇతర టెలీకాం సంస్థకు చెందిన సిమ్‌ వాడి సమయాన్ని సేవ్ చేసుకోవాలని ఆమె సామాజిక మాధ్యమం ద్వారా అభిమానులకు సూచన చేసింది. 
 
దీంతో వెంటనే స్పందించిన ఎయిర్‌టెల్ ప్రతినిధులు... ఆమెను సంప్రదించారు. పూజా హెగ్డేకు ఎదురవుతోన్న తమ సర్వీసు సమస్యలన్నీ పరిష్కరించారు. 'హాయ్ పూజా.. మీకు కలిగిన సేవల అంతరాయం పట్ల క్షమాపణలు చెబుతున్నాం. మీకు ఎదురవుతున్న సమస్య ఇప్పుడు పరిష్కారం అయిందని భావిస్తున్నాం' అని ఎయిర్‌టెల్ ఇండియా విభాగం ఓ ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments