Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుల్లో హైపర్ ఆది : ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (15:58 IST)
ప్రముఖ టీవీలో ప్రసారమయ్యే కామెడీ షో 'జబర్దస్త్' ఈ షో ద్వారా కమెడియన్‌‌గా గుర్తింపు పొందిన హైపర్ ఆది ఇపుడు చిక్కుల్లో పడ్డారు. ఆదిపై ఎల్బీనగర్‌ అసిస్టెంట్ పోలీస్ కమిషనరు శ్రీధర్‌ రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్‌ ఫెడరేషన్‌ సభ్యులు ఫిర్యాదు చేశారు. అందులో బతుకమ్మ, గౌరమ్మ, తెలంగాణ భాషను కించపరిచేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఈ ఫిర్యాదులో ఆది, స్క్రిప్ట్‌ రైటర్‌, మల్లెమాల ప్రొడక్షన్‌ పేర్లను వారు ప్రస్తావించారు. ఫిర్యాదు చేసిన వారిలో తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్, సమాచార హక్కు సాధన స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్తీక్, టీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి చింత మహేశ్, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ తదితరులు ఉన్నారు. 
 
గతంలోనూ ఆదిపై మానవహక్కుల సంఘానికి (హెచ్‌ఆర్సీ) ఫిర్యాదులు అందాయి. తమ మనోభావాలను దెబ్బతీసేలా స్కిట్ చేశారని ఆరోపిస్తూ పలువురు అనాథ పిల్లలు, సినీ విమర్శకుడు కత్త మహేష్‌లు హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments