Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై పోలీస్ కేసు.. అరెస్టు తప్పదా?

ఠాగూర్
బుధవారం, 13 నవంబరు 2024 (10:33 IST)
ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఏపీలో పోలీస్ కేసు నమోదైంది. ప్రకాశంజిల్లా మద్దిపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసే దర్యాప్తు ప్రారంభించారు. నవంబరు 19న మద్దిపాడు పీఎస్‌లో విచారణకు హాజరుకావాలంటూ ప్రకాశం జిల్లా పోలీసులు రాంగోపాల్‌వర్మకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే రెండు రోజుల క్రితం కూడా వర్మ‌‌కు ఆన్‌లైన్‌లో నోటీసులు పంపారని తెలుస్తోంది. 
 
"వ్యూహం" సినిమా ప్రమోషన్‌లో భాగంగా సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రంబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్, నారా బ్రాహ్మణిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎం. రామలింగం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటి యాక్ట్‌ కింద రాంగోపాల్‌వర్మపై నవంబర్‌ 10న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో రాంగోపాల్ వర్మను అరెస్టు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌ను పలు సందర్భాల్లో దుర్భాషలాడారు కూడా. వీటిపై జనసైనికులు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YS Jagan: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొదిలి పర్యటన వాయిదా: కారణం ఏంటంటే?

వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ కన్నుమూత

Madanlal: బీఆర్ఎస్ నేత బానోతు మదన్ లాల్ గుండెపోటుతో కన్నుమూత

COVID: ఏపీని తాకిన కరోనా.. భార్యాభర్తలతో పాటు ముగ్గురికి కోవిడ్ పాజిటివ్

అశ్లీల వీడియోలు చూపించి హోంగార్డు వేధిస్తున్నాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

తర్వాతి కథనం
Show comments