Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్.. అసత్య ప్రచారం చేయొద్దు... ఎస్పీబీ ఆరోగ్యంపై ఎస్పీ చరణ్ క్లారిటీ

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (13:12 IST)
కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుప్రసిద్ధ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు జరిగిపిన కరోనా నిర్ధారణ పరీక్షలో నెగిటివ్ వచ్చినట్టు వార్తలను ఆయన కుమారుడు ఎస్.పి. చరణ్ ఖండించారు. దయచేసి.. అసత్య వార్తలు, రూమర్లు ప్రసారం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పైగా, తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఆయన చికిత్స పొందుతున్న ఎంజీఎం ఆస్పత్రి వైద్య వర్గాలు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. 
 
కాగా, తాజాగా ఎస్పీబీకి నిర్వహించిన కరోనా పరీక్షలో నెగెటివ్ ఫలితం వచ్చినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. దీంతో ఎస్.పి. చరణ్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో తన తండ్రి ఇంకా ఐసీయూ వార్డులోనే ఎక్మో సపోర్టుతో ఉన్నారని, ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. 
 
ఈ నెల 5వ తేదీన కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఎస్.పి బాలు ఆరోగ్యం ఆ తర్వాత మరింతగా క్షీణించిపోయింది. దీంతో ఆయన ప్రస్తుతం ప్రత్యేక ఐసీయూ వార్డులో ఉంచి ఎక్మో సపోర్టుతో చికిత్స అందిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments