"పుష్ప"కు కాకినాడ పోలీసుల షాక్ - సక్సెస్ పార్టీకి నో పర్మిషన్

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (15:34 IST)
'పుష్ప' చిత్ర బృందానికి కాకినాడ పోలీసులు షాకిచ్చారు. ఈ చిత్రం గ్రాండ్ సక్సెస్‌ను పురస్కరించుకుని కాకినాడలో భారీ ఎత్తున సక్సెస్ పార్టీ నిర్వహించాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ, ఈ గ్రాండ్ సక్సెస్ పార్టీకి కాకినాడ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 
 
ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షల దిశగా పయనిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి కట్టడిపై ప్రత్యేక దృష్టిసారించింది. 
 
ఈ నేపథ్యంలో పుష్ప సక్సెస్ పార్టీ నిర్వహణకు అనుమతి ఇచ్చేందుకు కాకినాడ పోలీసులు తిరస్కరించారు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ స్పష్టం చేసింది. "ఈ రోజు కాకినాడలో జరగాల్సిన "పుష్ప'' మూసీవ్ సక్సెస్ పార్టీ పర్మిషన్ సమస్యల కారణంగా రద్దు అయ్యింది" అంటూ ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక

ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్

మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల ఆర్థిక నష్టం.. చంద్రబాబు ప్రకటన

పాలిటిక్స్‌ను పక్కనబెట్టి హరీష్ రావు ఇంటికి వెళ్లిన కల్వకుంట్ల కవిత

భిక్షాటన నివారణ చట్టం అమల్లోకి... ఇకపై ఏపీలో భిక్షాటన చేసేవాళ్లను...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments