Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్రాయని సంగీతరావు ఇకలేరు.. కరోనాతో చెన్నైలో మృతి

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (08:07 IST)
ప్రముఖ సంగీత విద్వాంసుడు, ఘంటసాల స్వరసహచరుడు, ఆయన సంగీత గురువు పట్రాయని సీతారామ శాస్త్రి కుమారుడు పట్రాయని సంగీతరావు కన్నుమూశారు. 101 యేళ్ళ వయస్సులో కరోనా వైరస్ సోకడంతో ఆయన చెన్నైలో బుధవారం చనిపోయారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈయన అంత్యక్రియలు గురువారం జరుగనున్నాయి. 
 
కర్నాటక, హిందుస్థానీ సంగీతరీతుల్ని ఔపోషణ చేసిన పట్రాయని, హార్మోనియం, వీణ, వయోలిన్ వాయిద్యాల్లో మహాదిట్ట. ఆయన అసలు పేరు పట్రాయని వేంకట నరసింహమూర్తి. అయితే సంగీతజ్ఞుల కుటుంబానికి చెందిన తన బిడ్డ తప్పకుండా సంగీత విద్వాంసుడు అవుతాడన్న నమ్మకంత మాతృమూర్తి మంగమ్మ.. ఆయన్ను సంగీతరావు అని పిలిచవారు. తర్వాత ఆ పేరే ఆయనకు స్థిరపడింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి తాలూకా ఆనవరం ఆగ్రహారం సంగీతరావుది స్వస్థలం. విజయనగరం సంగీత కాలేజీలో 1938లో ఘంటసాల - సంగీతరావుకు మధ్య స్నేహం కుదిరింది. ఘంటసాల తీసిన పరోపకారి చిత్రంలో పదండి తోసుకు పదండి ముందుకు అనే పాటను పట్రాయనే పాడారు. 
 
అనేక కూచిపూడి నాటకాలకు సంగీతం అందించారు. 1956 నుంచి 1982 వరకు ఘంటసాల కుటుంబంలోనే పట్రాయని కుటుంబం ఉండేది. ఏపీ ప్రభుత్వం ఘంటసాల పురస్కారంతో సత్కరించగా, తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డుతో సత్కరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

పడక గదిలోకి వచ్చిన ఆవు - ఎద్దు : కప్‌బోర్డులో దాక్కున్న మహిళ (Video)

2047 నాటికి దేశాభివృద్ధి ఖాయం.. అందులో 33శాతం మనమే వుంటాం: చంద్రబాబు

ఎందుకండీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు, ప్రాణం పోతే వస్తుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments