రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

వరుణ్
బుధవారం, 26 జూన్ 2024 (14:18 IST)
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళికి అరుదైన గౌరవంతో పాటు ఆహ్వానం కూడా లభించింది. భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ట్రిపుల్ ఆర్‌తో ప్రపంచమంతా తన ప్రతిభకు తగిన గుర్తింపును సాధించిన జక్కన్న ఆస్కార్ కలను కూడా సాకారం చేశారు. ఈ చిత్రంలో నాటు నాటు పాటకుగాను అస్కార్ అవార్డును సైతం గెలుచుకున్నారు. ఆస్కార్ అవార్డు కైవసం చేసుకున్న భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఈ సినిమా టీమ్ సభ్యులైన‌ రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు, కీరవాణి, చంద్రబోస్, సెంథిల్ సాబు శరిల్‌లకు ఆస్కార్ అకాడమీ కొత్త సభ్యులుగా ఇప్పటికే గతేడాది ఆహ్వానం అందుకున్నారు.
 
ఇపుడు రాజమౌళి అయన సతీమణి రమా రాజమౌళి కూడా ఆహ్వానం అందుకోవడం విశేషం. మొత్తం 487 మంది కొత్త సభ్యుల జాబితాని మోషన్ పిక్చర్ అండ్ సైన్స్ కేటగిరీలో సిద్ధం చేయగా ఇందులో వీరిద్దరికి కూడా అకాడమీ వారు ఆహ్వానం పలికారు. వీరితో పాటు భారత్ నుంచి షబానా ఆజ్మీ, రితేష్ సిద్వానీ, శీతల్ ఆర్మ, రవి వర్మన్, రీమా దాస్, ఆనంద్ కుమార్ టక్కర్, నిషా పహుజా, హేమల్ త్రివేది, గితేష్ పాండ్యాలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments