Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు యేడాది జైలుశిక్ష

ఠాగూర్
బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (14:40 IST)
టాలీవుడ్ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్‌కు చెక్ బౌన్స్ కేసులో ఏపీలోని ఒంగోలు కోర్టు ఒక యేడాది జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. జానకీరామయ్య అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఈ మేరకు శిక్ష విధించింది. పైగా, పిటిషన్‌కు కోర్టు ఖర్చులు కూడా బండ్ల గణేష్ చెల్లించాలని ఆదేశించింది.
 
గత 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తివద్ద బండ్ల గణేశ్ రూ.95 లక్షల అప్పు తీసుకున్నాడు. జానకీరామయ్య చనిపోగా ఆయన తండ్రికి బండ్ల గణేశ్‌ రూ.95కు చెక్ ఇచ్చాడు. ఈ చెక్ బ్యాంకులో వేయగా బౌన్స్ అయింది. దీంతో జానకీరామయ్య ఒంగోలు కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. 
 
జానకీరామయ్య వద్ద తీసుకున్న అప్పుతో పాటు కోర్టు ఖర్చులను కూడా వెంటనే తిరిగి చెల్లించాలని ఆదేశించింది. పైగా, చెక్ బౌన్స్ కావడంతో యేడాది జైలు శిక్ష విధించింది. గతంలో ఎర్రమంజల్ కోర్టు కూడా బండ్ల గణేశ్‌కు ఆరు నెలల జైలుశిక్ష విధించిన విషయం తెల్సిందే. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ దాఖలు చేసిన ఈకేసులో జైలుశిక్షతో పాటు రూ.15,86,550 జరిమానా విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments