Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 13న నైజాంలో ''ఓ మల్లి'' రిలీజ్: రమ్య శ్రీ రోల్ అదుర్స్!

Webdunia
మంగళవారం, 10 మే 2016 (19:27 IST)
బి.రమ్యశ్రీ ప్రధాన పాత్రధారిణిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఓ మల్లి'. ఆర్‌.ఎ.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై బి.ప్రశాంత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 13న నైజాంలో విడుదలవుతుంది. ఈ సందర్భంగా బి. రమ్యశ్రీ మాట్లాడుతూ 'ఓ గ్రామంలోని యువతి జీవితంలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. సినిమా బాగా రావడం కోసం రెండు సంవత్సరాలు పాటు యూనిట్‌ సభ్యులంతా శ్రమించారు. 
 
ఇటీవల నైజాం మినహా మిగతా ప్రాంతాల్లో విడుదలైన ఈ చిత్రం ఆడియెన్స్ నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా మంచి స్పందనను రాబట్టుకుంది. ఓ మంచి సినిమా తీశామన్న సంతృప్తి కలిగింది. సునీల్‌ కశ్యప్‌ సంగీతమందించిన పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కె.దత్తు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మే 13న సినిమాను నైజాంలో విడుదల చేస్తున్నాం. ఇక్కడి ప్రేక్షకులు కూడా మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

Yoga Day: యోగా తర్వాత అల్పాహారం- తోపులాట-స్పృహ కోల్పోయిన విద్యార్థిని

Operation Sindhu: ఇరాన్‌ నుంచి భారత్‌కు 827 మంది భారతీయులు.. భావోద్వేగం

Pushpa 2: తెలంగాణలో ప్రత్యక్ష్యమైన రప్పా రప్పా డైలాగ్ ఫ్లెక్సీలు.. ఎక్కడంటే?

"మేడే, మేడే" కాల్, ఈసారి ఇండిగో విమానం వంతు, ఏం జరిగిందో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments