Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఫ్యామిలీలో ఒంటరివాడైన హీరో ఎవరు?

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఫ్లాపులలో చిక్కుకుని విలవిలా కొట్టుకుంటున్నాడు. 'తిక్క', 'విన్నర్', 'నక్షత్రం', 'జవాన్', 'ఇంటెలిజెంట్' ఇలా వరుస ఫ్లాపులతో ముందుకు వెళ్ళలేక తెగ బాధపడ

Webdunia
సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (11:52 IST)
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఫ్లాపులలో చిక్కుకుని విలవిలా కొట్టుకుంటున్నాడు. 'తిక్క', 'విన్నర్', 'నక్షత్రం', 'జవాన్', 'ఇంటెలిజెంట్' ఇలా వరుస ఫ్లాపులతో ముందుకు వెళ్ళలేక తెగ బాధపడిపోతున్నాడు. మొదట్లో మూడు వరుస హిట్లను సాధించిన సాయిధరమ్ తేజ్ ఆ తర్వాత ఫ్లాప్‌లే ఎక్కువగా మూటగట్టుకున్నారు. సాయి ధరమ్ తేజ్‌ను ఇండస్ట్రీలో అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని, దీని వెనుక కొందరు బడా వ్యక్తులు ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీలో ముందుకు తీసుకెళదామనుకున్న వారే ఆ తర్వాత వరుస ఫ్లాప్‌లను మూటగట్టుకోవడంతో చేతులెత్తేసినట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి సాయి ధరమ్ మెగా ఫ్యామిలీ బ్రాండ్‌తోనే నెట్టుకొస్తున్నాడు. అయితే కొన్నిరోజులుగా కొంత మంది నిర్మాతలతో సాయి ధరమ్ తేజ్ సఖ్యతగా లేకపోవడంతో ఆ నిర్మాతలందరూ సాయి ధరమ్ తేజ్‌కు వ్యతిరేకంగా మారినట్లు తెలుస్తోంది. దీంతో దర్శకులెవరైనా మంచి కథను సిద్ధం చేసినా సాయి ధరమ్ తేజ్ వద్దకు వెళ్ళకుండా నిర్మాతలు ఆపేస్తున్నారట. 
 
మొదటి నుంచి పవన్ కళ్యాణ్ సపోర్ట్ సాయి ధరమ్ తేజ్‌కు ఎక్కువగా ఉండేది. అయితే ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సాయి విషయాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఇక చిరంజీవి అంటారా.. ఆయన సినిమాల గురించే ఆలోచించుకుంటున్నారు. నాగబాబు విషయానికొస్తే ఆయన కుమారుడు వరుణ్‌ తేజ్‌‌కు లైఫ్ ఇచ్చేందుకు కృషి చేస్తుంటారు. ఇలా ఎవరి పనిలో వారిలో బిజీగా ఉండడంతో మెగా ఫ్యామిలీలో సాయి ధరమ్ తేజ్ ఏకాకిగా మారి చివరకు ఫ్లాప్‌లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందట. ఈ వ్యవహారంపై ఫిల్మ్ నగర్‌లో జోరుగానే చర్చలు జరుగుతున్నాయట. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments