నిత్యామీనన్‌‌ను వదలని యూట్యూబర్.. పెళ్లి వదంతులు అతడి వల్లే..

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2022 (11:08 IST)
హీరోయిన్ నిత్యామీనన్‌‌ను యూట్యూబర్ వేధిస్తున్నాడు. గత కొన్ని నెలలుగా తన పెళ్లి విషయంలో వస్తున్న పుకార్లకు కారణం ఏంటనే దానిపై హీరోయిన్‌ నిత్యామీనన్‌ స్పందించారు. పుకార్ల వెనుక ఓ యూట్యూబర్‌ ఉన్నాడని, అతడే తనను 6 ఏళ్లుగా వేధిస్తున్నాడని చెప్పారు. 
 
"ఈ పుకార్లకు ప్రధాన కారణం సంతోష్‌ వర్కీ అనే ఓ యూట్యూబర్‌. అతడు ఆరేళ్లుగా నన్ను వేధిస్తున్నాడు. నా కుటుంబాన్ని కూడా వదలటం లేదు. వేర్వేరు ఫోన్‌ నెంబర్ల నుంచి నాకు ఫోన్‌ చేసి విసిగిస్తున్నాడు.
 
ఇప్పటివరకు అతడికి సంబంధించిన 30 నెంబర్లను బ్లాక్‌ చేశాను. నా తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి విసిగిస్తున్నాడు. మా వాళ్లు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేద్దాం అన్నారు. కానీ, నేను క్షమించి వదిలేశా. అయినా అతడు మారలేదు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో నన్ను పెళ్లి చేసుకోవాలనుందని అన్నాడు. అప్పటినుంచి నా పెళ్లిపై పుకార్లు మొదలుపెట్టాడు’’ అని పేర్కొన్నారు. 
 
కాగా, నిత్యా మీనన్‌ దశాబ్ధానికిపైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా కూడా  ఆమెపై పెద్దగా పుకార్లు రాలేదు. కానీ, గత కొద్దినెలల నుంచి వరుసగా ఆమె పెళ్లి విషయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలు.. కొత్త ఉప ముఖ్యమంత్రిగా ఎవరంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments