Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసానిని మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి : నిహారిక డిమాండ్

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (12:55 IST)
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై అసభ్యపదజాలంతో మాట్లాడిన సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై మెగా డాటర్ నిహారిక తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. 'రిపబ్లిక్' సినిమా ఫంక్షన్‌లో ఆడవాళ్లపై పవన్ ఒక్కమాట కూడా మాట్లాడలేదని నిహారిక వ్యాఖ్యానించింది. 
 
ఏపీ సీఎం జగన్‌పై ఆరోపణలు చేసినందుకే పోసాని ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నాడని  మండిపడింది. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న పోసానిని మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలని నిహారిక డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి పోసానిపై చర్యలు తీసుకోవాలని నిహారిక కోరింది. 
 
కాగా మంగళవారం నాడు ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో పవన్‌పై పోసాని తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు అసభ్యపదజాలంతో దూషణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవిని టీడీపీ నేతలు తిడితే పవన్ కల్యాణ్ ఎటు పోయారని ప్రశ్నించారు. 
 
చిరంజీవి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వారు తిడితే.. తానే కౌంటర్ ఇచ్చానని గుర్తుచేశారు. అంతేగాకుండా పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపైనా పోసాని మాట్లాడారు. పవన్, ఆయన అభిమానులు సైకోలని అన్నారు. దీంతో ఆయన ప్రెస్ మీట్ వద్దకు పవన్ అభిమానులు భారీగా చేరుకుని నిరసన తెలిపారు. హైదరాబాద్‌లో పవన్ అభిమానుల ఫిర్యాదు మేరకు పోసానిపై కేసు నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

Netumbo: నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా నంది-న్దైత్వా ప్రమాణం

UP Horror: 52 ఏళ్ల వ్యక్తిని చంపేసిన బావమరిది, అత్త హత్య చేశారు..

Jagan Letter: డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. మోదీకి జగన్ లేఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments