Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కినేని అన్నదమ్ములతో ఒకేసారి కలిసి నటిస్తున్న భామ ఎవరో తెలుసా?

Webdunia
మంగళవారం, 30 అక్టోబరు 2018 (17:38 IST)
అక్కినేని నాగార్జున కుమారులు నాగచైతన్య, అఖిల్ నటిస్తున్న వేర్వేరు సినిమాలలో ఒకే భామ ఇరువురికి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె పేరు నిధి అగర్వాల్. గతేడాది మున్నా మైఖేల్ చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన హిందీలో పరిచయమైంది. ఈ ఏడాది తెలుగు తెరకు కూడా పరిచయం కానుంది. తాజాగా నాగచైతన్య నటిస్తున్న 'సవ్యసాచి' చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 2వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఇందులో తమిళ నటుడు మాధవన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న నిధి అగర్వాల్ చైతూ తమ్ముడు అఖిల్‌తో పాటు 'మిస్టర్ మజ్ను' చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
ఒకేసారి ఇద్దరి అన్నదమ్ముల చిత్రాలలో నటించడం ప్రత్యేకమని, అలాగే ఈ అనుభూతి ఏ కొందరికి మాత్రమే లభిస్తుందని, రెండు చిత్రాలలోని కథనం దేనికదే ప్రత్యేకమని, ఒకేసారి రెండు చిత్రాల్లో నటించడం తనకు సవాలుగా మారిందంటూనే తాను మంచి నటిగా నిరూపించుకునేందుకు ఈ రెండు చిత్రాలు ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు ఆమె సవ్యసాచి చిత్ర ప్రమోషన్‌లో భాగంగా చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments