తిరుమలలో ప్రత్యక్షమైన 'దిల్' రాజు దంపతులు

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (12:00 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన కొత్త జంట 'దిల్' రాజు దంపతులు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. వీరిద్దరూ శనివారం ఉదయం కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. 
 
ఇటీవల వైఘా అనే మహిళను దిల్ రాజు రెండో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరి వివాహం తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నార్సింగపల్లిలో ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగింది. 
 
ఈ పెళ్లి లాక్డౌన్ ఆంక్షల కారణంగా అతి కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈ దంపతులు తిరుమలకు చేరుకుని తమ ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. 
 
కాగా, దిల్ రాజు మొదటి భార్య అనిత గత 2017లో అనోరాగ్యం కారణంగా చనిపోయిన విషయం తెల్సిందే. ఈ దంపతులకు హర్షిత అనే కుమార్తె ఉంది. ఈమె ఎంపిక చేసిన వైఘాను దిల్ రాజు రెండో భార్యగా స్వీకరించారు. ఈమె గతంలో ఎయిర్‌హోస్ట్‌గా పని చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments