Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ కేసు.. ఇద్దరు అరెస్ట్.. వాళ్లెవరంటే?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (18:26 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో తొలి అరెస్టు చోటుచేసుకుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతి కేసును సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రియాను పలుమార్లు ప్రశ్నించిన సీబీఐ, తొలిసారిగా ఆమె తల్లితండ్రులు ఇంద్రజిత్‌ చక్రవర్తి, సంధ్యలను సుమారు ఎనిమిది గంటల పాటు విచారించారు.
 
ఈ కేసులో మాదక ద్రవ్యాల కోణం ఉందనే అంశానికి సంబంధించి.. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. వారిలో ఒకరైన అబ్దుల్‌ బాసిత్‌ పరిహార్‌ను తాము ముంబయిలోని బాంద్రాలో అరెస్టు చేసినట్టు సంస్థ తెలిపింది. బాసిత్‌కు సుశాంత్ మేనేజర్ సామ్యూల్ మిరాండాతో సంబంధాలున్నట్టు తెలిసిందే. 
 
మిరాండా, రియా చక్రవర్తి సోదరుడు షోవిక్‌ చక్రవర్తి సూచనల మేరకు మాదక ద్రవ్యాలను సేకరించినట్టు తమకు సమాచారం ఉందని ఎన్‌సీబీ తెలిపింది. సుశాంత్‌ మాజీ మేనేజర్ మిరాండాను రియా చక్రవర్తి గత సంవత్సరం మే నెలలో నియమించారు. ఆయన సుశాంత్‌ ఇంటి నిర్వహణ, ఖర్చులు తదితర అన్ని వ్యవహారాలు చూసుకునేవారు. ఈయనపై సుశాంత్ కుటుంబ సభ్యులు డ్రగ్స్‌ సరఫరా చేయటం, సుశాంత్‌ డబ్బును భారీగా దుర్వినియోగం చేయటం వంటి ఆరోపణలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments