యూనిట్ సభ్యులకు నయనతార ఆ గిఫ్ట్... ఎంత ఆనందమో...?

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (19:22 IST)
మహానటి సినిమాలో మహానటిగా నటించడం కంటే జీవించేసిన కీర్తి సురేష్ అప్పట్లో పందెం కోడి 2 షూటింగ్ పూర్తిచేసిన తర్వాత చిత్ర యూనిట్‌లోని అందరికీ బంగారు నాణేలు అందజేసిన విషయం తెలిసిందే. అయితే... ఇప్పుడు అదే వరుసలో నయనతార వచ్చి చేరారంటున్నారు సినిమా యూనిట్ సభ్యులు.
 
అసలు విషయానికి వస్తే... పాత్రకి ప్రాధాన్యత ఉంటే ఎటువంటి రోల్‌లో‌నైనా నటించేందుకు వెనుకాడని ఈ లేడీ సూపర్ స్టార్ తమిళనాట ఇప్పటికే వరుస విజయాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే... కాగా తాజాగా ‘ఓకే ఓకే ‘ఫేమ్ ఎమ్ రాజేష్ తెరకెక్కిస్తున్న మిస్ట‌ర్ లోక‌ల్ చిత్రంలో శివకార్తికేయన్ సరసన క‌థానాయిక‌గా న‌టిస్తున్న న‌య‌న‌తార ఇటీవ‌ల త‌న పాత్రకి సంబంధించిన షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. 
 
అయితే షూటింగ్ పూర్తయిన వెంట‌నే నయన్, చిత్ర యూనిట్‌కి సంబంధించిన వారంద‌రికీ ఫాసిల్ కంపెనీ వాచ్‌ల‌ని గిఫ్ట్‌గా అందజేసింది. దీనిపై చిత్ర బృందం సంతోషం వ్య‌క్తం చేసింది. హిప్ హాప్ సంగీతం అందించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Naipunyam Portal: 2029 నాటికి యువతకు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి.. నారా లోకేష్

ChandraBabu: నాలుగు గంటలే నిద్రపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఫాలో అవుతున్న నారా లోకేష్

నవంబర్ 8న నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

2027 Jagan Padayatra: 2027లో జగన్ కొత్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా?

Lizard: వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి ప్రతిమలు మాయం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments