Webdunia - Bharat's app for daily news and videos

Install App

విషమంగా 'యమదొంగ' చిత్రంలో రంభ పాత్రధారి ఆరోగ్యం

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (15:37 IST)
జూనియర్ ఎన్టీఆర్ - ఎస్ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "యమదొంగ". ఈ చిత్రంలో 'యంగ్ యమ.. యంగ్ యమ' అనే ప్రత్యేక పాట ఉంది. ఇందులో రంభగా నటించిన హీరోయిన్ నవనీత్ కౌర్. ఈమె ప్రస్తుతం కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. 
 
నవనీత్ కౌర్ కుటుంబంలో ఏకంగా 12 మందికి ఈ వైరస్ సోకింది. వీరికి సేవలు చేసే క్రమంలో నవనీత్ కౌర్‌కు కూడా ఈ వైరస్ అంటుకుంది. దీంతో వెంటనే ఆమె చికిత్స కోసం అమరావతి దవాఖానలో చేరారు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ ఉండ‌డంతో నాగ్‌పూర్‌లోని ఓఖార్డ్ హాస్పిటల్‌లో చేరారు.
 
కానీ, ఆమె ఆరోగ్యంలో ఎలాంటి మార్పురాలేదు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈమెను ముంబై ఆసుపత్రికి తరలించి చికిత్స  అందిస్తున్న‌ట్టు తెలుస్తుంది. న‌వ‌నీత్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆమె అభిమానులు ప్రార్థిస్తున్నారు. 
 
ప్రస్తుతం ఈమె కుటుంబానికి చెందిన భర్త, పిల్లలతో పాటు.. మొత్తం 12 మంది కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలుగు చిత్రపరిశ్రమలో అనేక చిత్రాల్లో నటించిన నవనీత్ కౌర్... పెళ్లి చేసుకున్న తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా కొనసాగుతుంది. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments