'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రొమో వీడియోలో మోడీని కూడా వదల్లేదు...

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (15:35 IST)
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్''. ఈ చిత్రంలో ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం మిగిలిపోయిన షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవితంలో ఎన్టీఆర్‌గా ప్రమఖ రంగస్థల నటుడు విజయ్‌ కుమార్‌ నటిస్తున్నారు. అలాగే, లక్ష్మీపార్వతిగా యజ్ఞాశెట్టి కనిపించనుంది. 
 
కల్యాణీ మాలిక్‌ సంగీతం అందించిన ఈ సినిమా మార్చి 22వ తేదీ విడుదలకు సిద్ధం అవుతుండగా సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను వేగంగా  జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రచార చిత్రాలను, ట్రైలర్‌లను విడుదల చేసిన వర్మ.. ప్రమోషన్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ వీడియో ప్రోమోను దర్శకుడు వర్మ విడుదల చేశాడు. 
 
'ఎన్టీఆర్ స్వయంగా చంద్రబాబు తనను ఎలా వెన్నుపోటు పొడిచారో చెప్పాడు' అంటూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకం ఆధారంగా అప్పటి ఎన్టీఆర్ వ్యాఖ్యలను వీడియో రూపంలో తయారు చేసి రాంగోపాల్ వర్మ విడుదల చేశారు.
 
'చంద్రబాబు వెన్నుపోటు పొడిచింది నాకు కాదు.. నాకు అధికారం ఇచ్చిన మీకు' అంటూ ప్రజలతో ఎన్టీఆర్ తన ఆవేదనను పంచుకున్న వీడియోని రాంగోపాల్ వర్మ విడుదల చేశారు. 'ప్రజాస్వామ్యం బాగుండాలంటే ఎవరికి ఓటేయాలి' అనే విషయాన్ని ఎన్టీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారని వర్మ తన వీడియోలో ఎన్టీఆర్ సందేశంగా వినిపించారు. 
 
అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చంద్రబాబును ఉద్దేశించి 'నువ్వే మామకు వెన్నుపోటు పొడవటంలో సీనియర్' అంటూ చేసిన వ్యాఖ్యలను ప్రోమోలో ఉంచారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హవ్వ... కారుపై కూర్చుని నడిరోడ్డుపై వెళ్తూ జంట రొమాన్స్ (video)

కోల్డ్‌రిఫ్ దగ్గుమందు తయారీ కంపెనీపై చర్యలేవి? తమిళనాడు సర్కారుపై కేంద్రం ఆగ్రహం

ఢిల్లీ - కోల్‌కతా హైవేపై 4 రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్ - ఆకలితో అలమటిస్తున్న ప్రయాణికులు (వీడియో)

జీమెయిల్‌కు మంగళం ... జోహో ఫ్లాట్‌ఫామ్‌కు స్వాగతం... కేంద్ర మంత్రి అమిత్ షా

వివాహేతర సంబంధం: ప్రియురాలు పరిచయం చేసిన మహిళతో ప్రియుడు కనెక్ట్, అంతే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments