Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబరు 16న 'శంకర'గా వస్తున్న నారా రోహిత్

నారా రోహిత్ హీరోగా న‌టించిన 'శంక‌ర' సెప్టెంబ‌ర్ 16వ తేదీన విడుద‌లకానుంది. రెజీనా హీరోయిన్. తాతినేని స‌త్య ప్ర‌కాశ్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లీలా మూవీస్ ప‌తాకంపై నిర్మిస్తోంది. జె.ఆర్‌

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2016 (17:11 IST)
నారా రోహిత్ హీరోగా న‌టించిన 'శంక‌ర' సెప్టెంబ‌ర్ 16వ తేదీన విడుద‌లకానుంది. రెజీనా హీరోయిన్. తాతినేని స‌త్య ప్ర‌కాశ్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లీలా మూవీస్ ప‌తాకంపై నిర్మిస్తోంది. జె.ఆర్‌.మీడియా ప్రై.లిమిటెడ్‌తో క‌లిసి ఆర్.వి.చంద్ర‌మౌళి ప్ర‌సాద్ (కిన్ను) నిర్మించారు. ఎమ్వీ రావు స‌మ‌ర్పించారు. త‌మిళంలో చ‌క్క‌టి విజ‌యాన్ని సొంతం చేసుకున్న 'మౌన‌గురు' చిత్రానికి రీమేక్ ఇది. అక్క‌డ అరుళ్‌నిధి హీరోగా న‌టించారు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లతో పాటు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కాసుల స‌వ్వ‌డి చేసింది. ఈ స‌బ్జెక్టుకు యూనివ‌ర్శ‌ల్ యాక్సెప్టెన్స్ ఉండ‌టంతో ఎ.ఆర్‌.మురుగ‌దాస్ చిన్న చిన్న మార్పులు చేసి హిందీలోనూ తెర‌కెక్కించారు. 
 
'శంక‌ర' చిత్రం గురించి నిర్మాత ఆర్‌.వి. చంద్ర‌మౌళి ప్ర‌సాద్ (కిన్ను) మాట్లాడుతూ, 'వ్య‌వ‌స్థ‌లో ఉన్న లోటుపాట్లు శంక‌ర అనే కుర్రాడికి న‌చ్చ‌వు. వాటిని ప్ర‌తిఘ‌టించ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటాడు. ప్ర‌తి విష‌యాన్ని ప్ర‌శ్నించే కొడుకును చూసి అత‌ని క‌న్న త‌ల్లి, సోద‌రుడు బాధ‌ప‌డ‌తారు. దాంతో అత‌న్ని సొంతూరు నెల్లూరు నుంచి విజ‌య‌వాడ‌కు పంపుతారు. మ‌ధ్య‌లో ఓ కారు యాక్సిడెంట్ జ‌రుగుతుంది. ప్ర‌మాదానికి గురైన వ్య‌క్తిని కాపాడ‌టానికి కొంద‌రు ముందుకొస్తారు. అయితే వారు ర‌క్షించ‌డానికి బ‌దులు చంపేస్తారు. ఆ క్రైమ్‌లో శంక‌ర ఇరుక్కుంటాడు. అది ఎలా జ‌రిగింది? ఇంత‌కీ ప్ర‌మాదానికి గుర‌ైంది ఎవరు? కాపాడ‌టానికి ముందుకొచ్చి కాపాడ‌కుండా చంపేసిన వారు ఎవ‌రు? శ‌ంక‌ర నిర్దోషి అని నిరూపించుకున్నాడా? లేదా? వ‌ంటి ప్ర‌శ్న‌ల‌న్నిటికీ ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధాన‌మే మా 'శంక‌ర'. సాయికార్తిక్ మంచి సంగీతాన్నిచ్చారు. ట్యూన్ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది' అని చెప్పుకొచ్చారు. 
 
చిత్ర స‌మ‌ర్ప‌కుడు ఎమ్వీ రావు మాట్లాడుతూ, 'సెప్టెంబ‌ర్ 16న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల వారికీ న‌చ్చుతుంది. నారా రోహిత్ కెరీర్‌లో మంచి సినిమాగా నిలుస్తుంది' అని చెప్పారు. జాన్ విజ‌య్‌, రాజీవ్ క‌న‌కాల కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి కెమెరా: టి.సురేందర్‌ రెడ్డి, ఎడిట‌ర్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు. 

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పెద్దగా ఆవలించింది... దవడ లాక్ అయిపోయింది...

జగన్ లండన్ ట్రిప్.. ఏమవుతుందోనని ఆందోళన.. అయినా భయం లేదు..

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments