అలా మొదలైంది.. అంటూ సినిమా తీసి.. గొప్ప సక్సెస్ ఇచ్చిన దర్శకురాలు నందినిరెడ్డి. రెండో సినిమాకు తప్పటడుగు వేసింది. బబర్దస్త్ పేరుతో సినిమా తీసి రిలీజ్ చేస్తే.. అప్పటికే బాలీవుడ్లో వచ్చిన బ్యాండ్ బాజా అనే చిత్రాన్ని దింపేసింది. దీంతో అక్కడి నిర్మాతలు కేసువేసే దాకా వెళితే.. దాన్ని నిర్మాత బెల్లంకొండ సురేష్ ఏదోవిధంగా మేనేజ్ చేశాడు. ఆరకంగా నందిని రెడ్డికి అవకాశం రాకుండా గ్యాప్ వచ్చింది. ఇక ముచ్చటగా మూడోసారి ప్రయత్నంగా.. అలా మొదలైంది నిర్మాతలే రంజిత్ మూవీస్లో మరో అవకాశాన్ని ఇచ్చాడు.
అయితే ఈసారి కూడా మేరేజ్ నేపథ్యంగా తీసుకుంది. ఇది పూర్తి కుటుంబకథా చిత్రంగా.. ఎంటర్టైన్మెంట్ బాగా వుందని చెబుతున్నా... మళ్ళీ ఏదో సినిమాకు కాపీగా తీసిందనే వార్తలు విన్పిస్తున్నాయి. కళ్యాణి మాలిక్ అందించిన స్వరాలు.. ట్రైలర్ చూస్తుంటే.. పాత సినిమాల్లోని ఓ పాయింట్ తీసుకుందని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో నాగశౌర్య హీరోగా నటించాడు. ఇప్పటికే సక్సెస్ లేని ఈ హీరోతో బిజినెస్ కూడా కాకపోవడంతో.. సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. లెక్కప్రకారం సంక్రాంతికి విడుదల కావాల్సి వుంది. ప్రస్తుతం ఫిబ్రవరిలో కూడా కాకుండా మార్చిలో రిలీజ్ చేస్తే బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.