Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరబ్రహ్మశాస్త్రి మరణం తెలుగు వారికి తీరని లోటు : నందమూరి బాలకృష్ణ

మరుగునపడిపోయిన తెలుగు చరిత్ర వెలుగులోకి తెచ్చిన మహనీయులు పరబ్రహ్మశాస్త్రి పోషించిన పాత్ర బహు కీలకమైనది. కాకతీయుల చరిత్రను ప్రపంచానికి పరిచయం చేయడం మొదలుకొని శాతవాహనులు తెలుగువారే అని నిరూపించిన ఘటికుల

Webdunia
గురువారం, 28 జులై 2016 (17:01 IST)
మరుగునపడిపోయిన తెలుగు చరిత్ర వెలుగులోకి తెచ్చిన మహనీయులు పరబ్రహ్మశాస్త్రి పోషించిన పాత్ర బహు కీలకమైనది. కాకతీయుల చరిత్రను ప్రపంచానికి పరిచయం చేయడం మొదలుకొని శాతవాహనులు తెలుగువారే అని నిరూపించిన ఘటికులు పరబ్రహ్మశాస్త్రి. విద్యార్థులకు చరిత్ర పరిశోధనలో సరికొత్త బాట చూపిన ఆయన బుధవారం (జూలై 27)న తుదిశ్వాస విడిచారు.
 
ఈ సందర్భంగా శాతవాహనుల చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న "గౌతమిపుత్ర శాతకర్ణి" చిత్రంలో టైటిల్ రోల్ ప్లే చేస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ చరిత్రకారుడు పరబ్రహ్మశాస్త్రి మరణనానికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన 100వ చిత్రంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న "గౌతమిపుత్ర శాతకర్ణి" చిత్రం కోసం శాతవాహనుల్లో ఐదో రాజైన శాతకర్ణి గురించి తమకు తెలియని చాలా విషయాలను పరబ్రహ్మశాస్త్రి గారు నిర్వహించిన పరిశోధన, ఆయన రాసిన సంపుటాల నుంచే తెలుసుకొన్నట్టు తెలిపారు. 
 
అటువంటి మహోన్నత వ్యక్తి నేడు మన మధ్య లేరు అనే విషయం నన్ను చాలా బాధిస్తోంది. తెలుగు భాషను ప్రేమించే వ్యక్తిగా తెలుగు చరిత్రను దశదిసలా వ్యాపింపజేసిన పరబ్రహ్మశాస్త్రి కుటుంబానికి అండగా నిలుస్తానని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా "గౌతమిపుత్ర శాతకర్ణి" దర్శకులు క్రిష్ మరియు యూనిట్ సభ్యులందరూ పరబ్రహ్మశాస్త్రి మరణానికి చింతిస్తూ నివాళులర్పించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments