Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారంచేడులో బాలయ్య: గుర్రపు స్వారీ చేసిన అఖండ!

Webdunia
శనివారం, 15 జనవరి 2022 (13:01 IST)
నందమూరి హీరో బాలకృష్ణ తన భార్యతో కలిసి గురువారం ప్రకాశం జిల్లా కారంచేడుకు చేరుకున్నారు. అక్కడ సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. బాలకృష్ణ దంపతులతో పాటు జయకృష్ణ, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన బంధువులు గురువారం కారంచేడుకు చేరుకున్నారు. 
 
బాలకృష్ణను చూసేందుకు స్థానికులు, అభిమానులు భారీ సంఖ్యలో దగ్గుబాటి నివాసానికి చేరుకున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో ఇంటిలోపలకు ఎవరిని అనుమతించలేదు.
 
కారంచేడులో దగ్గుబాటి పురందేశ్వరి ఇంటి వద్ద భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకల్లో లోకేశ్వరి, ఉమామహేశ్వరి సహా బంధువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య గుర్రం స్వారి చేశారు. 
 
ఇకపోతే కరోనా కారణంగా ఎవరినీ లోపలికి అనుమతించట్లేదని సమాచారం. చివరిసారిగా, 2019లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం కుప్పంలో నారా, నందమూరి కుటుంబాలు కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే.
 
సినిమాల విషయానికి వస్తే.. అటు 'అఖండ' బ్లాక్ బస్టర్ హిట్, ఇటు ఆహా 'అన్‌స్టాపబుల్' షో సూపర్ హిట్ అవడంతో బాలకృష్ణ  మంచి జోరు మీద ఉన్నారు. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన 'అఖండ' సినిమాకు ఇప్పటికీ వసూళ్ల వర్షం కురుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం!!

Pawan Kalyan: తిరుమలలో చాలా అనర్థాలు.. మద్యం మత్తులో పోలీసులు.. పవనానంద ఏం చేస్తున్నారు?

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments