Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్‌బాబు అభిమానుల‌కు విషెస్ చెప్పిన నమ్రతా శిరోద్కర్

Webdunia
శనివారం, 14 మే 2022 (18:22 IST)
Namrata Shirodkar,at sudarshan theater
సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన సర్కారు వారి పాట చిత్రం గురువార‌మే విడుద‌లైంది. ఈ సినిమాను మూడు ప్ర‌ముఖ బేన‌ర్లు నిర్మించాయి. మొద‌టిరోజే మంచి టాక్ తెచ్చుకోవ‌డంతో నిర్మాత‌లు మైత్రీమూవీ మేకర్స్ ట‌పాసుల‌తో ఆనందం వ్య‌క్తం చేసుకున్నారు. మ‌రో నిర్మాత ఎస్‌.వి.క్రియేష‌న్స్ ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం రాత్రి దిల్‌రాజు ఆధ్వ‌ర్యంలో పార్టీ సంద‌డి చేసుకున్నారు.
 
Parasuram, namrata
ఇక మూడో నిర్మాణ సంస్థ మ‌హేష్‌బాబు నిర్మాణ సంస్థ ఎ.ఎం.బి. సంస్థ‌. ఈ సంస్థ త‌ర‌ఫున మ‌హేష్ స‌తీమ‌ణి  నమ్రతా శిరోద్కర్ మరియు సర్కారు వారి పాట బృందం హైదరాబాద్‌లోని సుదర్శన్ 35mm వద్ద శ‌నివారంనాడు మ్యాట్నీని వీక్షించారు. ఆమె రాక సంద‌ర్భంగా కృష్ణ‌, మ‌హేస్‌బాబు ఆల్ ఇండియా ఫ్యాన్స్ అధ్య‌క్షుడు, అభిమానులు నినాదాలు చేశారు.
 
న‌మ్ర‌త త‌న కుటుంస‌భ్యుల‌తో సినిమాను వీక్షించారు. అభిమానులు, ప్రేక్ష‌కుల స‌మ‌క్షంలో ఆమె తిల‌కించి పుల‌కించిపోయారు. సినిమా ఆరంభానికి ముందు జ‌న‌గ‌న మ‌ణ‌.. జాతీయ గీతం వేయ‌గానే అంద‌రూ గౌర‌వంగా నిల‌బ‌డి సెల్యూట్ చేశారు. అనంత‌రం సినిమా ముగిశాక అభిమానుల స‌మ‌క్షంలో కేక్‌ను క‌ట్‌చేశారు. ఈ సినిమాను ఇంత‌గా ఆద‌రిస్తున్న మ‌హేష్‌బాబు అభిమానుల‌కు నమ్రతా శిరోద్కర్ న‌మ‌స్కారం పెడుతూ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

సంబంధిత వార్తలు

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments