Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనలోకి నమ్రత.. అంతా మహేశ్ బాబు వల్లే..?

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2022 (15:52 IST)
తెలుగు సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మహేష్ బాబు మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ఇద్దరిలో ప్రస్తుతం పవన్ సినిమాలతో పాటు రాజకీయాల్లో ఉన్నారు. అటు మహేష్ బాబు సినిమాలతో పాటు వ్యాపార రంగంలో కూడా కొనసాగుతున్నారు. 
 
అయితే స్నేహితుడు పవన్ జనసేనకు మహేష్ బాహటంగా మద్దతు ప్రకటించారని ప్రచారం జోరుగా సాగుతోంది. పవన్‌కు మద్దతుగా మహేష్ ముందుగా వారి కుటుంబ సభ్యులను జనసేనలోకి పంపినట్లు తెలుస్తోంది. ఇంటర్నల్‌గా సపోర్టు చేసి స్నేహితుడి పార్టీ పవర్‌లోకి రావాలని మహేష్ బాబు కోరుకుంటున్నారుట.
 
ఇందులో భాగంగా.. మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ జనసేనలో చేరనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో కూడా కృష్ణ కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా ఉండేవారు. వీరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఆత్మీయ అనుబంధం ఉండేది. 
 
వైసీపీ ఆవిర్భావం తరువాత కృష్ణ కుటుంబం జగన్ వెంటే ఉండేది. ఇక కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. అయితే ప్రస్తుతం కుటుంబమంతా టీడీపీలోనే ఉంది. అయితే మహేష్ భార్య నమ్రతా మాత్రం జనసేన వైపు మొగ్గుచూపడానికి మహేషే కారణంగా తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments