Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఊపిరి''కి తర్వాత నిఖిల్‌తో మల్టీస్టారర్‌కు అక్కినేని నాగార్జున రెడీ

2016లో కార్తీతో కలిసి నటించిన ఊపిరి సినిమా బంపర్ హిట్ కావడంతో టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అక్కినేని నాగార్జున, యంగ్‌ హీరో నిఖిల్‌ ప్రధాన పాత్రల్లో ఓ మల్టీ స్టారర్‌ మూవీ చేయబోతున్నట్లు తెలిసింది. ఈ ఏడాది

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (16:27 IST)
2016లో కార్తీతో కలిసి నటించిన ఊపిరి సినిమా బంపర్ హిట్ కావడంతో టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అక్కినేని నాగార్జున, యంగ్‌ హీరో నిఖిల్‌ ప్రధాన పాత్రల్లో ఓ మల్టీ స్టారర్‌ మూవీ చేయబోతున్నట్లు తెలిసింది. ఈ ఏడాది ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని నాగార్జున ఉవ్విళ్లూరుతున్నారు.

నిఖిల్‌ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' తర్వాత నటిస్తున్న 'కేశవ' చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున, నిఖిల్ సినిమాను 'ప్రేమమ్‌'తో ఇటీవల మంచి సక్సెస్‌ అందుకున్న దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించనున్నారట. 
 
ఇంకా టైటిల్‌ ఖరారు చేయని ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నాగార్జున ప్రస్తుతం తన తర్వాతి చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' పనుల్లో బిజీగా ఉన్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments