Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనసూయ, రష్మికి పోటీగా వచ్చిన కొత్త యాంకరమ్మ... (వీడియో)

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2019 (14:36 IST)
జబర్దస్త్ కామెడీ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కామెడీ షోలో వేస్తున్న పంచ్‌లకు కాసేపు నవ్వుకుని వదిలేద్దాంలే అనుకునే ప్రేక్షకులతో పాటుగా ఈ షోలో వల్గర్ పంచ్‌లు, అక్రమ సంబంధాలు, డబుల్ మీనింగ్ డైలాగ్‌లు, వ్యంగ్యస్త్రాలు ఎక్కువయ్యాయని చెప్పే ప్రేక్షకులు కూడా ఉన్నారు. అయితే కొద్ది కాలం క్రితం జబర్దస్త్ జడ్జ్ నాగబాబు సంచలనాత్మకంగా అందులో నుండి తప్పుకున్నారు.
 
అయితే జబర్దస్త్ షోకి పోటీగా అచ్చం దానికి జిరాక్స్ లాగా అనిపించే మరొక షో జీ తెలుగులో ఇటీవల ప్రారంభమైంది. జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన నాగబాబు, చమ్మక్ చంద్ర, ధనరాజ్, వేణు, కిర్రాక్ ఆర్పీలు ఈ ‘అదిరింది’ షోతో కామెడీగా చేయడానికి సిద్ధమయ్యారు. మొదటి ఎపిసోడ్‌లో జడ్జిలుగా నాగబాబు, ఆయన కూతురు నిహారిక ఉండగా, రాజ్ తరుణ్ స్పెషల్ పెర్ఫామెన్స్ చేసారు.
 
ఈ కామెడీ షోకి యాంకర్‌గా టీవీ నటి సమీరను ఇంట్రడ్యూస్ చేసారు జీ తెలుగువారు. జబర్దస్త్ అంత హిట్ కావడానికి కామెడీతో పాటుగా యాంకర్ రష్మి, అనసూయ గ్లామర్ షో కూడా కారణమని ఒప్పుకుని తీరాల్సిందే. మరి సమీర ఆ రేంజ్‌లో పేరు తెచ్చుకుంటుందో లేదో తెలియదు గానీ అప్పుడే వల్గర్ పంచ్‌లు, డబుల్ మీనింగ్ డైలాగ్‌లు మొదలుపెట్టింది.
 
నాగబాబు సంగతి పక్కనపెడితే.. గత ఆదివారం నాడు తొలి ఎపిసోడ్ ప్రారంభం కాగా.. ‘అదిరింది’ సేమ్ టు సేమ్ జబర్దస్త్ మాదిరే ఉందనే విమర్శలు వినిపించాయి. ఇక ఈ షోకి యాంకర్‌గా టీవీ నటి సమీరను తీసుకువచ్చారు. ఒకవైపు జబర్దస్త్ షోతో యాంకర్ రష్మి, అనసూయ తమ గ్లామర్ షోతో అదనపు ఆకర్షణగా నిలుస్తుంటే.. వీరికి పోటీగా సమీరను రంగంలోకి దింపింది జీ తెలుగు 
 
ఆడపిల్ల, అభిషేకం, భార్యామణి, ప్రతిబింబం, మంగమ్మగారి మనవరాలు తదితర సీరియల్స్‌లో నటించి మెప్పించింది సమీర. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ సీరియల్ నటిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం సీరియల్స్‌కి గ్యాప్ ఇచ్చిన సమీర జీ తెలుగు ‘అదిరింది’ కామెడీ షోతో అదరగొట్టేందుకు స్టేజ్ మీదికి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తున్న వినయ్ నర్వాల్‌కు భార్య వీడ్కోలు (Video)

పహల్గామ్ ఘటన ఊచకోత ... మతం అడిగి హతమార్చడం దారుణం : ఓవైసీ

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments