Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ చైతన్య 'సవ్యసాచి' ఫస్ట్ పంచ్ విడుదల

హ్యాండ్సమ్ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం "సవ్యసాచి". చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. "ప్రేమమ్" తర్వాత నాగచైతన్య-చందు మొండేటి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ఇవాళ విడుద

Webdunia
శుక్రవారం, 16 మార్చి 2018 (20:10 IST)
హ్యాండ్సమ్ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం "సవ్యసాచి". చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. "ప్రేమమ్" తర్వాత నాగచైతన్య-చందు మొండేటి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ఇవాళ విడుదల చేసారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వై.నవీన్-వై.రవిశంకర్-మోహన్(సివిఎం)లు మాట్లాడుతూ.. "తన రెండు చేతులను సమర్ధవంతంగా వినియోగించగల అర్జునుడిని "సవ్యసాచి" అంటారు. టైటిల్‌కి తగ్గట్లుగానే సినిమా, నాగచైతన్య క్యారెక్టరైజేషన్ ఉండబోతోంది.
 
నాగచైతన్య మాస్ అప్పీల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్లో మాధవన్, భూమికలు ప్రత్యేక పాత్రలు పోషిస్తుండటం విశేషం. ఇండియాలో షూటింగ్ ఫినిష్ అయ్యాక అమెరికా వెళ్లనున్నాం. షూటింగ్ పూర్తి చేసి జూన్ 14న చిత్రాన్ని విడుదల చేయనున్నాం. కీరవాణి "బాహుబలి" తర్వాత సంగీతం అందించడంతో పాటు నేపధ్య సంగీతం కూడా సమకూరుస్తున్న చిత్రం సవ్యసాచి కావడం విశేషం" అన్నారు.
 
నాగచైతన్య, నిధి అగర్వాల్, ఆర్.మాధవన్, భూమిక చావ్లా, రావు రమేష్, వెన్నెల కిశోర్, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: యువరాజ్, కళ: రామకృష్ణ, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: రామ్ - లక్ష్మణ్, కో-డైరెక్టర్: చలసాని రామారావు, సి.ఈ.ఓ: చిరంజీవి(చెర్రీ), లైన్ ప్రొడ్యూసర్: పి.టి.గిరిధర్, నిర్మాతలు: వై.నవీన్, వై.రవిశంకర్, మోహన్ (సివిఎం), కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: చందు మొండేటి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments