Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిగర్ సంఘం ఎన్నికల్లో ఓటు వేయని రజినీకాంత్

Webdunia
ఆదివారం, 23 జూన్ 2019 (18:02 IST)
నడిగర్ సంఘం ఎన్నికల్లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం దర్బార్. ఈ చిత్రం షూటింగ్ ముంబైలో శరవేగంగా సాగుతోంది. దీనికోసం రజినీకాంత్ ముంబైలో మకాం వేసివున్నారు. 
 
కాగా, చెన్నైలో దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. ఈ ఎన్నికల్లో సాయంత్రానికి రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. అయితే, చాలా మంది నటీనటులు ఈ ఎన్నికల్లో నేరుగా ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. 
 
పలువురు నటీనటులు బ్యాలెట్ ఓటును వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రముఖ నటుడు రజినీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. ఈ ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా ఓటు వేస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. 
 
కాగా, ఈ ఎన్నికల్లో హీరో విశాల్ సారథ్యంలోని పాండవుల జట్టు, సీనియర్ నటు కె. భాగ్యరాజ్ సారథ్యంలోని శంకర్ దాస్ జట్టు పోటీపడుతున్నాయి. విజయావకాశాలపై ఇరు జట్లూ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ambati: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?: అంబటి ప్రశ్న.. ట్రోల్స్ మొదలు

తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు... ఏడుగురు మృతి

Auto Driver: ఆ ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు సంపాదన.. ఎలా?

Crow: మెస్సీని మరిచిపోండి.. కాకి ఫుట్ బాల్ ఆడితే ఎలా వుంటుంది.. (video)

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments