Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిగర్ సంఘం ఎన్నికల్లో ఓటు వేయని రజినీకాంత్

Webdunia
ఆదివారం, 23 జూన్ 2019 (18:02 IST)
నడిగర్ సంఘం ఎన్నికల్లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం దర్బార్. ఈ చిత్రం షూటింగ్ ముంబైలో శరవేగంగా సాగుతోంది. దీనికోసం రజినీకాంత్ ముంబైలో మకాం వేసివున్నారు. 
 
కాగా, చెన్నైలో దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. ఈ ఎన్నికల్లో సాయంత్రానికి రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. అయితే, చాలా మంది నటీనటులు ఈ ఎన్నికల్లో నేరుగా ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. 
 
పలువురు నటీనటులు బ్యాలెట్ ఓటును వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రముఖ నటుడు రజినీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. ఈ ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా ఓటు వేస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. 
 
కాగా, ఈ ఎన్నికల్లో హీరో విశాల్ సారథ్యంలోని పాండవుల జట్టు, సీనియర్ నటు కె. భాగ్యరాజ్ సారథ్యంలోని శంకర్ దాస్ జట్టు పోటీపడుతున్నాయి. విజయావకాశాలపై ఇరు జట్లూ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాహుల్ గాంధీకి అస్వస్థత - ఎన్నికల ప్రచారం రద్దు

అనంతపురం నారాయణ కళాశాల ఇంటర్ విద్యార్థి మేడ పైనుంచి దూకి ఆత్మహత్య (video)

అభిమాని చనిపోవడం బన్నీ చేతుల్లో లేకపోవచ్చు.. కానీ ఆ ఫ్యామిలీని పట్టించుకోకపోవడం? సీఎం రేవంత్

సినిమా చూసొచ్చాక నా భార్య తన తాళి తీసి ముఖాన కొట్టింది, చంపి ముక్కలు చేసా: భర్త వాంగ్మూలం

మాజీ సీఎం జగన్‌కు షాకిచ్చిన ఏపీ సర్కారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

తర్వాతి కథనం
Show comments