Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులో ఐటీ సోదాలు.. నిర్మాత ఎర్నేని నవీన్‌కు అస్వస్థత

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (15:53 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని బడా నిర్మాతల్లో ఒకరు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థకు చెందిన నిర్మాతల్లో ఒకరైన ఎర్నేని నవీన్ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రక్తపోటు ఎక్కువ కావడంతో ఆయన అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. నవీన్ అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు బీపీ సాధారణ స్థాయికి చేరుకుంది. దీంతో ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయన్ను సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది.
 
కాగా, గత మూడు రోజులుగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థకు చెందిన కార్యాలయాలు, దర్శక నిర్మాత కె.సుకుమార్ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, ఎర్నేని నవీన్ ఇంట్లో ఈ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన తీవ్ర ఒత్తిడికి గురికావడంతో అస్వస్థతకు లోనైనట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆమ్‌స్ట్రాంగ్ దారుణ హత్య- పా.రంజిత్ భావోద్వేగం.. షాక్ నుంచి తేరుకోని చెన్నై (video)

ప్రపంచ క్షమాపణ దినోత్సవం 2024.. క్షమించమని అడిగితే తప్పేలేదు!!

ప్రపంచ చాక్లెట్ దినోత్సవం.. డార్క్ చాక్లెట్ తింటే మేలే.. కానీ ఎక్కువగా తీసుకుంటే?

ఆగస్టు 4వ తేదీ వరకు తెలంగాణలో బోనాలు

మావోయిస్ట్ నేత అరెస్ట్ - ప్రెషర్ కుక్కర్ బాంబు, రెండు గ్రెనేడ్లు స్వాధీనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments