Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఠాగూర్
బుధవారం, 2 ఏప్రియల్ 2025 (19:41 IST)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వం వహిస్తున్న చిత్రం "విశ్వంభర". ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మెగా అభిమానుల్లో మూవీపై భారీ అంచనాలను పెంచేసింది. తాజాగా ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ చిత్రంలో హీరో మెగాస్టార్ చిరంజీవి ఓ పాట పాడనున్నారని ఆ వార్త సారాంశం. ఆస్కార్ అవార్డు విన్నర్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీత స్వరాలకు చిరంజీవి గాత్రం అందివ్వనున్నట్టు టాక్ వినిపిస్తుంది. అయితే, ఇంకా ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. కానీ మెగా అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. మెగాస్టార్ వాయిస్‌‍లో పాట వినాలని ఆశిస్తున్నారు. 
 
మరోవైపు, చిరంజీవి వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రం ఉగాది సందర్భంగా హైదరాబాద్ నగరంలో ప్రారంభమైంది. జూన్ నెల నుంచ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అలాగే, దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

Pawan Kalyan: పదివేల మంది మహిళలకు వరలక్ష్మీ వ్రతం గిఫ్టులు ఇవ్వనున్న పవన్

UP: ఎందుకొచ్చిన గొడవ.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేయించిన భర్త.. ఎక్కడో తెలుసా? (video)

Rajesh Sakariya: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి.. నిందితుడిపై దశాబ్ధాల పాటు కేసులున్నాయిగా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments