Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రామ్మా చిలకమ్మా' పాటను చిరంజీవి వద్దన్నారు.. ఎవరి దగ్గర చేతులు కట్టుకుని పనిచేయను: మణిశర్మ

సంగీత దర్శకుడు, మెలోడీ బ్రహ్మ మణిశర్మ టాప్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు సంగీతం సమకూర్చారు. తాజాగా ఆయనకు అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసే సంగీతం సమకూర్చిన మణిశర్మను ప్రస్తుతం

Webdunia
శనివారం, 13 మే 2017 (15:16 IST)
సంగీత దర్శకుడు, మెలోడీ బ్రహ్మ మణిశర్మ టాప్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు సంగీతం సమకూర్చారు. తాజాగా ఆయనకు అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసే సంగీతం సమకూర్చిన మణిశర్మను ప్రస్తుతం పట్టించుకునే వారు లేకపోయారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మణిశర్మ మాట్లాడారు. ప్రస్తుతం వస్తున్న తెలుగు పాటలపై, ట్యూన్స్‌పై సంచలన కామెంట్స్ చేశారు.
 
ప్రస్తుతం పాటల స్థాయి తగ్గడానికి గల కారణం హీరోలేనని చెప్పేశారు. హీరోల నిర్ణయాలకు అనుగుణంగా పాటల్ని ట్యూన్ చేయాల్సిన పరిస్థఇతులు ఏర్పడటంతో నేటి సినిమాల పాటల స్థాయి దిగజారిపోయిందంటూ మణిశర్మ ఘాటుగా విమర్శించారు. ఇదే సందర్భంలో మెగాస్టార్ చిరంజీవిపై కూడా మణిశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
చిరంజీవి ఆల్ టైం హిట్ పాటల్లో 'చూడాలని ఉంది' లోని 'రామ్మా చిలకమ్మా' సాంగ్ గురించి మాట్లాడుతూ ఉదిత్ నారాయణ పాడిన ఈ పాట ఆ సినిమా నుండి తొలిగించమని చిరంజీవి చెప్పినా తాను వినకుండా అదే పాటను ఆ సినిమాలో ఉంచడంతో ఆపాట అప్పట్లో బంపర్ హిట్ అయ్యిందని మణిశర్మ గుర్తు చేశారు. 
 
అప్పట్లో టాప్ హీరోలు సంగీత దర్శకుడు చెప్పే మాటకు గౌరవం ఇచ్చేవారని ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు. ఫిలిమ్ ఇండస్ట్రీలో ప్రస్తుత వాతావరణానికి ఇమడలేక తాను చాలా అవకాశాలు వదులుకున్నానని మణిశర్మ అన్నారు. తనకు కథే ముఖ్యమని.. హీరోలు చెప్పే విధంగా బాణీలు, వారి ఛాయిస్ వల్ల సంగీతానికి కథతో సందర్భాలతో పనిలేకుండా పోతోంది. దీని వల్ల సంగీత దర్శకులపై ఒత్తిడి ఎక్కువైంది. 
 
అందుకే తాను చిన్న దర్శకులతో పనిచేస్తున్నానని మణిశర్మ వివరించారు. చిన్న సినిమాల్లో వచ్చే పాటలే బాగున్నాయని.. ఇతరుల దగ్గర చేతులు కట్టుకుని పనిచేయలేనని.. ఎవరి దయతోనూ తాను బతకడం లేదని మణిశర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు.

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments