Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకుతో కలిసి ప్లాస్మాదానం డొనేట్ చేసిన సంగీత దర్శకుడు కీరవాణి

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (13:15 IST)
టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి రెండోసారి ప్లాస్మా దానం చేశారు. సోమవారం తన కుమారుడు కాలభైరవతో కలిసి కోవిడ్ బాధితుల కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో ప్లాస్మా ఇచ్చారు. కరోనా నుంచి కోలుకున్న వీళ్లిద్దరూ గతంలోనూ ప్లాస్మా ఇచ్చి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
 
శరీరంలో యాంటీబాడీస్ ఇంకా యాక్టివ్‌గా ఉండటం వల్ల ప్లాస్మా ఇస్తున్నట్లు వారు తెలిపారు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నట్లు వారు తెలిపారు. త్వరలో RRR మ్యూజిక్ ప్రారంభిస్తామని కీరవాణి వెల్లడించారు. అంతకుముందు వీళ్లిద్దరూ కిమ్స్ హాస్పిటల్లో మొదటిసారి ప్లాస్మాను దానం చేసినట్లు తెలిపారు.
 
అటు రాజమౌళి కూడా త్వరలో ప్లాస్మా డొనేట్ చేయనున్నట్లు తెలిపారు. గత కొద్దిరోజుల క్రితం రాజమౌళి, కీరవాణి కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కీరవాణి తన ట్విట్టర్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు.
 
మా రక్తంలో ప్రతిరోధకాలు ఇంకా చురుకుగా ఉండటంవల్లే నేను మా కొడుకు రెండోసారి ప్లాస్మా దానం చేశాము. ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్లాస్మా దానం ఇవ్వడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కీరవాణి వెల్లడించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Air India: ఎయిర్ ఇండియాలో ఏసీ లేదు.. నరకం చూసిన ప్రయాణీకులు (video)

ఆ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు ఏమయ్యారు?

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో యాత్రి డాక్టర్ లింకు?

భారత్ ధర్మసత్రం కాదు... ఇక్కడ స్థిరపడటానికి మీకేం హక్కు ఉంది? సుప్రీంకోర్టు

అందాల పోటీలపైనే కాదు.. అగ్ని ప్రమాదాలపై కూడా దృష్టిసారించండి : కేటీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments