Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌పోర్టులో ఇళయరాజాకు చుక్కెదురు.. సారీ చెప్పిన అధికారి

Webdunia
బుధవారం, 8 జూన్ 2016 (09:29 IST)
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకి ఎయిర్ పోర్టులో చుక్కెదురైంది. ఇళయరాజా ఇటీవలే తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళూరులోని కొన్ని దేవాలయాలను దర్శించుకునేందుకు వెళ్లారు. దర్శనం ముగించుకుని ఇళయరాజా కుటుంబం తిరిగి చెన్నై చేరుకునేందుకు ఆదివారం కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. 
 
కాగా అధికారులు ఆయన బ్యాగులో ఏదో ఉందని అనుమానించి స్కానర్ వద్ద నిలిపివేసి పూర్తిగా తనిఖీలు చేపట్టారు. ఆయన బ్యాగ్‌లో కొబ్బరి ప్రసాదం మాత్రమే ఉందని చెప్పిన కూడా అధికారి పట్టించుకోలేదట. దీంతో కోపం చెందిన ఆయన తనయుడు కార్తీక్ రాజా సెక్యూరిటీతో గొడవకి దిగాడు. కార్తీక్ రాజా అంతటితో ఊరుకోకుండా తన మొబైల్ ద్వారా అక్కడి సెక్యూరిటీ అధికారి ఫొటోలను తీయడంతో గొడవ మరింత పెద్దదైంది.
 
ఆ ఫొటోలను మొబైల్ నుంచి తొలగించే వరకు అధికారి వారిని పంపించలేదు. తర్వాత అక్కడే ఉన్న ఒక ఒక విలేఖరి వచ్చి ''ఆయన సంగీత దర్శకుడు ఇళయరాజా'' అని చెప్పడంతో వారిని ఎయిర్ పోర్టులోకి అనుమతించారు. అక్కడ జరిగిన తతంగాన్ని సీసీటీవిలో వీక్షించిన ఉన్నతాధికారి వెంటనే ఇళయరాజాకు క్షమాపణలు చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. తర్వాత కాస్త ఆలస్యంగా బయలుదేరిన విమానంలో ఇళయరాజా కుటుంబం చెన్నైకి వెళ్లింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments