ఎఫ్-2 బతికించింది.. ఆ మూడు సినిమాలు ముంచేశాయి..

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (17:36 IST)
అక్కినేని అఖిల్‌ను ఫ్లాప్‌లు వదలట్లేదు. అఖిల్, హలో, మజ్ను సినిమాలు హిట్ కాకుండా ఫ్లాప్ టాక్‌ను సంపాదించి పెట్టాయి. తెలుగు చిత్ర సీమకు 2018 బాగా కలిసొచ్చింది. అయితే 2019 కూడా వరుస హిట్లు వుంటాయని ట్రేడ్ వర్గాలు భావించారు. 
కానీ 2019 ప్రారంభంలోనే ఎన్టీఆర్, వినయ విధేయ రామ, ఎఫ్-2, మిస్టర్ మజ్ను వంటి సినిమాలు విడుదలైనా.. ఈ సినిమాల్లో మూడు సినిమాలు ఓవర్సీస్ లో దారుణ పరాజయాన్ని చవి చూశాయి. ఎన్టీఆర్, వినయ విధేయ రామ సినిమాలు సంక్రాంతి సీజన్ లో విడుదలైనా మిలియన్ క్లబ్ లోకి ఎంటర్ కాలేకపోయాయి. వినయ, ఎన్టీఆర్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ  'ఎఫ్2' మాత్రమే ఇప్పటికే 2 మిలియన్ క్లబ్ లో చేరడం విశేషం. 
 
భారీ అంచనాల మధ్య జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిస్టర్ మజ్ను డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా 3 కోట్ల ఓవర్సీస్ బిజినెస్ జరిగింది.
 
అక్కినేని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్న మజ్ను కూడా ఫ్లాప్ కావడంతో.. టాలీవుడ్‌కు 2019 ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. కామెడీకి పెద్ద ప్రాధాన్యం ఇచ్చిన వెంకీ, వరుణ్, తమన్నా, మెహ్రీన్‌ల ఎఫ్-2 మాత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది. కలెక్షన్ల పరంగా మంచి విజయాన్ని సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments