Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎఫ్-2 బతికించింది.. ఆ మూడు సినిమాలు ముంచేశాయి..

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (17:36 IST)
అక్కినేని అఖిల్‌ను ఫ్లాప్‌లు వదలట్లేదు. అఖిల్, హలో, మజ్ను సినిమాలు హిట్ కాకుండా ఫ్లాప్ టాక్‌ను సంపాదించి పెట్టాయి. తెలుగు చిత్ర సీమకు 2018 బాగా కలిసొచ్చింది. అయితే 2019 కూడా వరుస హిట్లు వుంటాయని ట్రేడ్ వర్గాలు భావించారు. 
కానీ 2019 ప్రారంభంలోనే ఎన్టీఆర్, వినయ విధేయ రామ, ఎఫ్-2, మిస్టర్ మజ్ను వంటి సినిమాలు విడుదలైనా.. ఈ సినిమాల్లో మూడు సినిమాలు ఓవర్సీస్ లో దారుణ పరాజయాన్ని చవి చూశాయి. ఎన్టీఆర్, వినయ విధేయ రామ సినిమాలు సంక్రాంతి సీజన్ లో విడుదలైనా మిలియన్ క్లబ్ లోకి ఎంటర్ కాలేకపోయాయి. వినయ, ఎన్టీఆర్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ  'ఎఫ్2' మాత్రమే ఇప్పటికే 2 మిలియన్ క్లబ్ లో చేరడం విశేషం. 
 
భారీ అంచనాల మధ్య జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిస్టర్ మజ్ను డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా 3 కోట్ల ఓవర్సీస్ బిజినెస్ జరిగింది.
 
అక్కినేని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్న మజ్ను కూడా ఫ్లాప్ కావడంతో.. టాలీవుడ్‌కు 2019 ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. కామెడీకి పెద్ద ప్రాధాన్యం ఇచ్చిన వెంకీ, వరుణ్, తమన్నా, మెహ్రీన్‌ల ఎఫ్-2 మాత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది. కలెక్షన్ల పరంగా మంచి విజయాన్ని సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ జ్యుడీషియల్ సభ్యుడిగా వేమిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించిన భారత ప్రభుత్వం

వామ్మో... నాకు పాము పిల్లలు పుట్టాయ్: బెంబేలెత్తించిన మహిళ

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments