Webdunia - Bharat's app for daily news and videos

Install App

నచ్చని నేతలపై ఆగ్రహిస్తారు. నచ్చని సినిమాలను పట్టించుకోరంటున్న ఎస్పీ బాలు

తమకు నచ్చని నాయకుడిపై రోడ్లపైకి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేసే ప్రజలు.. తమకు నచ్చని సినిమా, పాటను వ్యతిరేకించే విషయంలో ఎందుకు ముందుకు రారని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రశ్నించారు. కన్నడ, తమిళుల మాదిరిగా మన తెలుగు వాళ్లకు భాష మీద ప్రేమ ఎందుకు పెరగ

Webdunia
సోమవారం, 23 జనవరి 2017 (06:25 IST)
తమకు నచ్చని నాయకుడిపై రోడ్లపైకి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేసే ప్రజలు.. తమకు నచ్చని సినిమా, పాటను వ్యతిరేకించే విషయంలో ఎందుకు ముందుకు రారని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రశ్నించారు. కన్నడ, తమిళుల మాదిరిగా మన తెలుగు వాళ్లకు భాష మీద ప్రేమ ఎందుకు పెరగడం లేదని తాను నిరంతరం మధనపడుతూ ఉంటానని చెప్పారు. కళలను, మన సంగీతాన్ని కాపాడుకునే విషయంలో సంకెళ్లు వేసుకుని నపుంసకులుగా ప్రజలు బ్రతుకుతున్నారన్న బాధను బాలు వ్యక్తం చేశారు. 
 
విజయవాడ రోటరీ క్లబ్ తనకు జీవన సాఫల్యపురస్కారం అందజేసిన సందర్భంగా బాలు నేటి సినిమాలు, కళలు, ప్రజల్లో నిర్లక్ష్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సభలో ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు తన మనసులోని భావాలను బాలు పంచుకున్నారు. జాతులు, కులాల కొట్లాట మధ్య కళలు చనిపోవడం ప్రస్తుత సమాజంలో కనిపిస్తున్న అతిపెద్ద బాధాకర పరిణామమని అభిప్రాయపడ్డారు.

తమ హీరోలకు జాతీయ అవార్డులు రావడం లేదని గోల చేసే సోకాల్డ్ ఫ్యాన్స్.. ఆ స్థాయిలో సినిమాలు చేయడం లేదని ఎందుకు ప్రశ్నించరని అన్నారు. అగ్ర కథానాయకులు కళాత్మక సినిమాలపై దృష్టి సారించాలని సూచించారు. ‘దంగల్‌’ వంటి సినిమాలు తెలుగు హీరోలు చేయాలని కోరారు.
 
హీరోలు కనీసం ఒక్క సినిమా జాతి, భాష కోసం చేయాలని అన్నారు. ఏడాదికి నాలుగు సినిమాలు తీస్తే ఒక్కటైనా జాతీయ అవార్డు వచ్చేలా నటించాలన్నారు. మిథునం లాంటి సినిమాకు ధియేటర్లే దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సినిమాలు వస్తే నిర్ధాక్షిణ్యంగా చిన్న సినిమాలను ధియేటర్ల నుంచి తీసేస్తున్నారని వాపోయారు. సినిమాల స్థాయిని నిర్ణయించేది ప్రేక్షకులేనని చెప్పారు. తెలుగువాళ్లు ఐక్యత, అంకితభావం లేనివాళ్లని ఎస్పీ బాలసుబ్రమణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
కాగా, తన మనసులో భావాలను ఒక బహిరంగ వేదికపై బాలు ఇలా మనసువిప్పి పంచుకోవడాన్ని కళాభిమానులు కరతాళ ధ్వనులతో నిలబడి హర్షం పిలికారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments