Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనీలాండ‌రింగ్ కేసు: జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు కాస్త ఊర‌ట

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2022 (12:45 IST)
Jacqueline Fernandez
మనీలాండ‌రింగ్ కేసులో బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు కాస్త ఊర‌ట ల‌భించింది. రూ.200కోట్ల మ‌నీలాండ‌రింగ్ కేసులో ఆమెకు సోమ‌వారం మ‌ధ్యంత‌ర బెయిల్ ల‌భించింది. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు రూ. 50 వేల పూచిక‌త్తుతో బెయిల్ మంజూరు చేసింది. 
 
ఈ కేసు‌లో ప్ర‌ధాన నిందితుడిగా జైల్లో ఉన్న‌ సుఖేశ్‌ చంద్ర‌శేఖ‌ర్ నుంచి ఖ‌రీదైన బ‌హుమ‌తులు అందుకున్న జాక్వెలిన్‌పై ఈడీ కేసు న‌మోదు చేసింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ఆమెను రెండుసార్లు విచారించారు. ఆమె ఆర్థిక లావాదేవీల‌పై విచార‌ణ చేప‌ట్టారు. బాలీవుడ్ న‌టికి సుకేశ్ రూ. 7కోట్లకు పైగా విలువైన ఆభరణాలను బహుమతిగా ఇచ్చాడు. 
 
జాక్వెలిన్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ఖ‌రీదైన కార్లు, బ్యాగులు, దుస్తులు, గడియారాలను కూడా ఇచ్చిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈడీ విచార‌ణ‌లో ఈ విష‌యాల‌ను జాక్వెలిన్ ఒప్పుకున్న‌ట్టు తెలుస్తోంది. దాంతో, ఈ కేసులో ఆమె పేరు కూడా చేర్చిన ఈడీ.. అనుబంధ ఛార్జిషీట్ దాఖ‌లు చేసింది. 
 
ఈ ఛార్జిషీట్‌ను ప‌రిశీలించిన న్యాయ‌స్థానం సోమ‌వారం కోర్టు ఎదుట హాజ‌రుకావాల‌ని ఆదేశించింది. ఈ కేసుపై త‌దుప‌రి విచార‌ణ‌ను అక్టోబ‌ర్ 22వ తేదీకి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై దాడి చేశాం... భారత్‌ను భయపెట్టాం : పాక్ ప్రధాని గొప్పలు

ఉగ్రవాదులకు జ్యోతి మల్హోత్రా పహెల్గాం లొకేషన్ షేర్ చేసిందా?, నాకేం తెలియదంటున్న ఆమె తండ్రి

Chandrababu: మే 22 నుండి మూడు రోజుల పాటు ఢిల్లీలో చంద్రబాబు

ఏపీ లిక్కర్ స్కామ్ : నిందితులకు షాకిచ్చిన ఏసీబీ కోర్టు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పది శాతం తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments