Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనీలాండ‌రింగ్ కేసు: జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు కాస్త ఊర‌ట

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2022 (12:45 IST)
Jacqueline Fernandez
మనీలాండ‌రింగ్ కేసులో బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు కాస్త ఊర‌ట ల‌భించింది. రూ.200కోట్ల మ‌నీలాండ‌రింగ్ కేసులో ఆమెకు సోమ‌వారం మ‌ధ్యంత‌ర బెయిల్ ల‌భించింది. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు రూ. 50 వేల పూచిక‌త్తుతో బెయిల్ మంజూరు చేసింది. 
 
ఈ కేసు‌లో ప్ర‌ధాన నిందితుడిగా జైల్లో ఉన్న‌ సుఖేశ్‌ చంద్ర‌శేఖ‌ర్ నుంచి ఖ‌రీదైన బ‌హుమ‌తులు అందుకున్న జాక్వెలిన్‌పై ఈడీ కేసు న‌మోదు చేసింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ఆమెను రెండుసార్లు విచారించారు. ఆమె ఆర్థిక లావాదేవీల‌పై విచార‌ణ చేప‌ట్టారు. బాలీవుడ్ న‌టికి సుకేశ్ రూ. 7కోట్లకు పైగా విలువైన ఆభరణాలను బహుమతిగా ఇచ్చాడు. 
 
జాక్వెలిన్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ఖ‌రీదైన కార్లు, బ్యాగులు, దుస్తులు, గడియారాలను కూడా ఇచ్చిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈడీ విచార‌ణ‌లో ఈ విష‌యాల‌ను జాక్వెలిన్ ఒప్పుకున్న‌ట్టు తెలుస్తోంది. దాంతో, ఈ కేసులో ఆమె పేరు కూడా చేర్చిన ఈడీ.. అనుబంధ ఛార్జిషీట్ దాఖ‌లు చేసింది. 
 
ఈ ఛార్జిషీట్‌ను ప‌రిశీలించిన న్యాయ‌స్థానం సోమ‌వారం కోర్టు ఎదుట హాజ‌రుకావాల‌ని ఆదేశించింది. ఈ కేసుపై త‌దుప‌రి విచార‌ణ‌ను అక్టోబ‌ర్ 22వ తేదీకి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments