Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాజ్‌పేయి నిజమైన రాజనీతిజ్ఞుడు : మెగాస్టార్ చిరంజీవి

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (15:01 IST)
మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి నిజమైన రాజనీతిజ్ఞుడని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. పైగా, తనకు లాల్ బహదూర్ శాస్త్రి, వాజ్‌పేయి ఇష్టమైన రాజకీయ నేతలుగా చెప్పారు. మహాత్మా గాంధీ పుట్టిన రోజునే జన్మించిన శాస్త్రి కూడా బాపూజీలాగే తన జీవితాన్ని గడిపారని గుర్తుచేశారు. 
 
ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం "గాడ్‌ఫాదర్". ఇటీవల విడుదలైన మంచి విజయం అందుకుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. ఇందులో చిరుని పూరి ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. 
 
ఈ సినిమా పొలిటికల్ డ్రామా కావడంతో మీకు ఇష్టమైన రాజకీయ నేతలు ఎవరు అంటూ పూరి ప్రశ్నించారు. దీనికి చిరంజీవి ఏమాత్రం ఇబ్బందిపడకుండా ఈ జనరేషన్‌లో ఇష్టమైన నేతలు ఎవరు అంటే తన వద్ద సమాధానం లేదన్నారు. 
 
అయితే, పాత కాలంలో చాలా మంది గొప్ప నేతలు ఉన్నారని, పార్టీలకు అతీతంగా వాళ్లంటే తనకు ఇష్టమని చెప్పారు. శాస్త్రి, వాజ్‌పేయి తనకు ఇష్టమైన నాయకులు అని చెప్పారు. ఈ ఇద్దరి నాయకత్వంలో మన దేశం చాలా పురోగతిని సాధించిందని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments