బాబాయ్.. నీ మాటలే మాకు స్ఫూర్తి... గ్రామాన్ని దత్తత తీసుకున్న చెర్రీ

Webdunia
ఆదివారం, 21 అక్టోబరు 2018 (16:56 IST)
శ్రీకాకుళం జిల్లాను తిత్లీ తుఫాను సర్వనాశనం చేసింది. అనేక గ్రామాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితిలో లేవు. ఈ గ్రామాల్లో ప్రజలు గుక్కెడు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో తిత్లీ ప్రజలను ఆదుకునేందుకు పారిశ్రామిక వేత్తలు, రాజకీయ, సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు.
 
ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు, యంగ్ హీరో రామ్ చరణ్ శ్రీకాకుళం ప్రజలకు అండగా ఉండేందుకు ముందుకొచ్చారు. తానున్నానంటూ అభయ హస్తం ఇచ్చారు. తిత్లీ తుఫాను ప్రభావిత గ్రామాన్ని దత్తత తీసుకోవాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
 
తన బాబాయ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని వెల్లడించారు. అయితే ఏ గ్రామాన్ని దత్తత తీసుకుంటారనే విషయం త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. గ్రామం దత్తత విషయంపై తన బృందంతో చర్చించానన్నారు. ఏ గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్నది తాను నియమించిన బృందం గుర్తిస్తుందని, ఆ తర్వాత గ్రామాన్ని దత్తత తీసుకుంటానని రామ్ చరణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?

కొత్త ఇల్లు కట్టావ్ లక్ష ఇస్తావా లేదా? ఇవ్వనన్నందుకు యజమానిని చితక్కొట్టిన హిజ్రాలు

Low Pressure: బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం

నిద్రపోతున్నప్పుడు భారీ వస్తువుతో దాడి.. టైల్ కార్మికుడు హత్య.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments