Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేవకు కూడా ఏపీలో యుద్ధం చేయాల్సివస్తుంది: నాగబాబు

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (13:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాసేవ (జనసేవ) చేసేందుకు సైతం యుద్ధం చేయాల్సిన దుస్థితి నెలకొందని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌రు 2న జ‌న‌సేన పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా శ్ర‌మ‌దాన కార్య‌క్ర‌మాలు నిర్వహించాయి. జనసైనికులు అనేక ప్రాంతాల్లో రోడ్లకు మరమ్మతులు చేశారు. 
 
అయితే, అధికార వైకాపా పార్టీ నేతల ఒత్తిడి మేరకు... పోలీసులు రోడ్లు బాగుచేయ‌నివ్వ‌కుండా కొంద‌రు అడ్డంకులు సృష్టించార‌ని జ‌న‌సేన తెలిపింది. దీనిపై సినీన‌టుడు నాగ‌బాబు స్పందిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు.
 
'మన రాష్ట్రంలోని దుస్థితి ఏంటంటే జనసేవకు కూడా ఒక యుద్ధమే చేయవలసి వస్తోంది. చంద్ర‌గిరి నియోజ‌క వ‌ర్గంలోని జ‌న‌సైనిక్ మ‌నోహ‌ర్ దేవర శ్రీవిద్యా నికేత‌న్ సంస్థ స‌మీపంలో అర‌కిలోమీట‌రు రోడ్డును బాగు చేయించారు. కొంద‌రు అడ్డుకోవాల‌ని చూసిన‌ప్ప‌టికీ విజ‌య‌వంతంగా ప‌ని పూర్తి చేశారు' అని నాగ‌బాబు చెప్పారు. 
 
కాగా, రోడ్డు వేసేందుకు కావాల్సిన మెటీరియ‌ల్‌ను ఆ ప్రాంతంలోకి రాకుండా అడ్డుకోవాల‌ని కొంద‌రు ప్ర‌య‌త్నాలు చేశార‌ని వీడియోలో జ‌న‌సేన చెప్పింది.  దీనికి సంబంధించిన వీడియోను ఒకటి నాగబాబు షేర్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments