Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం: ప్రముఖులకు నోటీసులు.. మాకేపాపం తెలియదంటూ..?

టాలీవుడ్‌లో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. ఇప్పటికే డ్రగ్స్ దందాలో మొత్తం 40 మంది టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల పేర్లు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం 12 మందికి నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఈ

Webdunia
శుక్రవారం, 14 జులై 2017 (11:47 IST)
టాలీవుడ్‌లో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. ఇప్పటికే డ్రగ్స్ దందాలో మొత్తం 40 మంది టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల పేర్లు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం 12 మందికి నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, తొలుత అరెస్ట్ అయిన కెల్విన్ నుంచి పూరీ జగన్నాథ్ స్వయంగా మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసే వాడని పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. 
 
పూరీ డ్రగ్స్ కొన్నట్టు స్పష్టమైన ఆధారాలు వుండగా, ఆయన నుంచి హీరోయిన్ చార్మీ, క్యారెక్టర్ నటుడు సుబ్బరాజులకు ఇచ్చినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇక జీశాన్ అనే నైజీరియన్ నుంచి హీరో రవితేజకు పలుమార్లు డ్రగ్స్ వెళ్లాయని సిట్ అధికారులు నిర్ధారించుకున్నారు. ఆ తరువాతే రవితేజకు నోటీసులు పంపారని సమాచారం. రెండో జాబితా ప్రకారం నోటీసులు పంపేందుకు ఎక్సైజ్ రెడీ అవుతోంది. ఈ కేసులో తొలుత అరెస్ట్ అయిన కెల్విన్ సహా పలువురి కాల్ డేటాలో వీరందరి నంబర్లు ఉన్నాయి. 
 
అయితే ఇప్పటికే రవితేజ, నందు, నవదీప్, ముమైత్ ఖాన్, పూరీ జగన్నాథ్, ఛార్మీలకు ఎక్సైజ్ నోటీసులు పంపినట్లు టీవీల్లో వార్తలు వస్తున్నాయి. కానీ వీరందరూ తమకే పాపం తెలియదంటున్నారు. తన భర్త నందుకు సిట్ పోలీసుల నుంచి నోటీసులు వచ్చాయని మీడియాలో వార్తలు చూసి అవాక్కయ్యానని అంది. నందుకు ఎటువంటి చెడు అలవాట్లూ లేవని స్పష్టం చేసింది. నందు కూడా ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశాడు. నవదీప్‌ను కాపాడేందుకు ఐదుగురు అగ్రహీరోలు రంగంలోకి దిగినట్లు సమాచారం. తాను సిగరెట్ కూడా తాగనని తనకు నోటీసులేంటి అంటూ ఆర్ట్ డైరక్టర్ చిన్నా అన్నాడు. 

కేసీఆర్‌ కల చెదిరింది.. తెలంగాణ ఆవిర్భవించి దశాబ్దం.. సీన్‌లోకి సోనియమ్మ

జగన్ అహంకారమే ఆయనను ఓడిస్తుంది : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఎన్నికల కౌంటింగ్.. బెట్టింగ్‌లు.. నరాలు తెగే ఉత్కంఠ.. గెలుపు ఎవరిదో..?

తెలంగాణాలో తొలిసారి రికార్డు స్థాయి ధర పలికిన ఫ్యాన్సీ నంబర్!!

ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ప్రవేశించిన ఐసిస్ ఉగ్రవాదులు

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

తర్వాతి కథనం
Show comments