టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం: ప్రముఖులకు నోటీసులు.. మాకేపాపం తెలియదంటూ..?

టాలీవుడ్‌లో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. ఇప్పటికే డ్రగ్స్ దందాలో మొత్తం 40 మంది టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల పేర్లు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం 12 మందికి నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఈ

Webdunia
శుక్రవారం, 14 జులై 2017 (11:47 IST)
టాలీవుడ్‌లో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. ఇప్పటికే డ్రగ్స్ దందాలో మొత్తం 40 మంది టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల పేర్లు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం 12 మందికి నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, తొలుత అరెస్ట్ అయిన కెల్విన్ నుంచి పూరీ జగన్నాథ్ స్వయంగా మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసే వాడని పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. 
 
పూరీ డ్రగ్స్ కొన్నట్టు స్పష్టమైన ఆధారాలు వుండగా, ఆయన నుంచి హీరోయిన్ చార్మీ, క్యారెక్టర్ నటుడు సుబ్బరాజులకు ఇచ్చినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇక జీశాన్ అనే నైజీరియన్ నుంచి హీరో రవితేజకు పలుమార్లు డ్రగ్స్ వెళ్లాయని సిట్ అధికారులు నిర్ధారించుకున్నారు. ఆ తరువాతే రవితేజకు నోటీసులు పంపారని సమాచారం. రెండో జాబితా ప్రకారం నోటీసులు పంపేందుకు ఎక్సైజ్ రెడీ అవుతోంది. ఈ కేసులో తొలుత అరెస్ట్ అయిన కెల్విన్ సహా పలువురి కాల్ డేటాలో వీరందరి నంబర్లు ఉన్నాయి. 
 
అయితే ఇప్పటికే రవితేజ, నందు, నవదీప్, ముమైత్ ఖాన్, పూరీ జగన్నాథ్, ఛార్మీలకు ఎక్సైజ్ నోటీసులు పంపినట్లు టీవీల్లో వార్తలు వస్తున్నాయి. కానీ వీరందరూ తమకే పాపం తెలియదంటున్నారు. తన భర్త నందుకు సిట్ పోలీసుల నుంచి నోటీసులు వచ్చాయని మీడియాలో వార్తలు చూసి అవాక్కయ్యానని అంది. నందుకు ఎటువంటి చెడు అలవాట్లూ లేవని స్పష్టం చేసింది. నందు కూడా ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశాడు. నవదీప్‌ను కాపాడేందుకు ఐదుగురు అగ్రహీరోలు రంగంలోకి దిగినట్లు సమాచారం. తాను సిగరెట్ కూడా తాగనని తనకు నోటీసులేంటి అంటూ ఆర్ట్ డైరక్టర్ చిన్నా అన్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మంచి ఆరోగ్యం లేకపోతే ఎంత సంపద ఉన్నా వృధానే : సీఎం చంద్రబాబు

తండ్రి మరణించాడని తెలిసి కన్నెత్తి చూడని తాగుబోతు.. అంత్యక్రియలు నిర్వహించిన అధికారులు

పీజేఆర్‌ను చంపిందే కాంగ్రెస్.. ఆయన ఫ్యామిలీకి రేవంత్ చోటు లేకుండా చేశారు : జగదీశ్ రెడ్డి

మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానం ఉంది.. కేటీఆర్ వచ్చి వెళ్ళాకే చనిపోయినట్టు ప్రకటించారు : తల్లి మహానంద

ఒక్క ఛాన్స్ పేరుతో ఏపీలో విధ్వంసం సృష్టించారు.. బీహార్ ఓటర్లకు మంత్రి లోకేశ్ వినతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

తర్వాతి కథనం
Show comments