Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి మృతిపై ఎలాంటి చర్చ అవసరం లేదు: భారత విదేశాంగ శాఖ

అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై జాతీయ మీడియా అనుమానం వ్యక్తం చేస్తూ పలు కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీదేవి మృతిపై నెలకొన్న అనుమానాలపై భారత విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. శ్రీదేవి

Webdunia
శనివారం, 10 మార్చి 2018 (08:25 IST)
అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై జాతీయ మీడియా అనుమానం వ్యక్తం చేస్తూ పలు కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీదేవి మృతిపై నెలకొన్న అనుమానాలపై భారత విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. శ్రీదేవి ఫిబ్రవరి 24వ తేదీన దుబాయ్‌లోని ఓ హోటళ్లో బాత్ ‌టబ్‌లో పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదవశాత్తు బాత్‌ టబ్‌లో పడి ఆమె మరణించినట్లు దుబాయ్ ఫోరెన్సిక్ రిపోర్టు వెల్లడించింది. ఆపై నాలుగు రోజుల తర్వాత ముంబైలో శ్రీదేవి అంత్యక్రియలు జరిగాయి. కానీ శ్రీదేవి మృతి పట్ల అభిమానుల్లో అనుమానాలున్నాయి. 
 
ఉన్నట్టుండి శ్రీదేవి  మరణించడం వెనుక ఏదో జరిగిందని ఆమె ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి మృతిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ తనకు తెలిసినంత వరకు దుబాయ్ సర్కారు పూర్తి స్థాయి నివేదిక ఇచ్చిందని.. అదికూడా తమకు అందినట్లు తెలిపారు. ఒకవేళ శ్రీదేవి మృతి వెనుక అనుమానించదగ్గ అంశాలు ఏమైనా ఉంటే ఇప్పటికల్లా బయటకు వచ్చేవని తెలిపారు. ఇక ఈ విషయంపై ఎలాంటి చర్చ అవసరం లేదని రవీష్ కుమార్ తేల్చి చెప్పేశారు. శ్రీదేవి సహజమరణమేనని ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments