Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి మృతిపై ఎలాంటి చర్చ అవసరం లేదు: భారత విదేశాంగ శాఖ

అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై జాతీయ మీడియా అనుమానం వ్యక్తం చేస్తూ పలు కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీదేవి మృతిపై నెలకొన్న అనుమానాలపై భారత విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. శ్రీదేవి

Webdunia
శనివారం, 10 మార్చి 2018 (08:25 IST)
అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై జాతీయ మీడియా అనుమానం వ్యక్తం చేస్తూ పలు కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీదేవి మృతిపై నెలకొన్న అనుమానాలపై భారత విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. శ్రీదేవి ఫిబ్రవరి 24వ తేదీన దుబాయ్‌లోని ఓ హోటళ్లో బాత్ ‌టబ్‌లో పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదవశాత్తు బాత్‌ టబ్‌లో పడి ఆమె మరణించినట్లు దుబాయ్ ఫోరెన్సిక్ రిపోర్టు వెల్లడించింది. ఆపై నాలుగు రోజుల తర్వాత ముంబైలో శ్రీదేవి అంత్యక్రియలు జరిగాయి. కానీ శ్రీదేవి మృతి పట్ల అభిమానుల్లో అనుమానాలున్నాయి. 
 
ఉన్నట్టుండి శ్రీదేవి  మరణించడం వెనుక ఏదో జరిగిందని ఆమె ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి మృతిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ తనకు తెలిసినంత వరకు దుబాయ్ సర్కారు పూర్తి స్థాయి నివేదిక ఇచ్చిందని.. అదికూడా తమకు అందినట్లు తెలిపారు. ఒకవేళ శ్రీదేవి మృతి వెనుక అనుమానించదగ్గ అంశాలు ఏమైనా ఉంటే ఇప్పటికల్లా బయటకు వచ్చేవని తెలిపారు. ఇక ఈ విషయంపై ఎలాంటి చర్చ అవసరం లేదని రవీష్ కుమార్ తేల్చి చెప్పేశారు. శ్రీదేవి సహజమరణమేనని ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments