Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి మృతిపై ఎలాంటి చర్చ అవసరం లేదు: భారత విదేశాంగ శాఖ

అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై జాతీయ మీడియా అనుమానం వ్యక్తం చేస్తూ పలు కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీదేవి మృతిపై నెలకొన్న అనుమానాలపై భారత విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. శ్రీదేవి

Webdunia
శనివారం, 10 మార్చి 2018 (08:25 IST)
అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై జాతీయ మీడియా అనుమానం వ్యక్తం చేస్తూ పలు కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీదేవి మృతిపై నెలకొన్న అనుమానాలపై భారత విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. శ్రీదేవి ఫిబ్రవరి 24వ తేదీన దుబాయ్‌లోని ఓ హోటళ్లో బాత్ ‌టబ్‌లో పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదవశాత్తు బాత్‌ టబ్‌లో పడి ఆమె మరణించినట్లు దుబాయ్ ఫోరెన్సిక్ రిపోర్టు వెల్లడించింది. ఆపై నాలుగు రోజుల తర్వాత ముంబైలో శ్రీదేవి అంత్యక్రియలు జరిగాయి. కానీ శ్రీదేవి మృతి పట్ల అభిమానుల్లో అనుమానాలున్నాయి. 
 
ఉన్నట్టుండి శ్రీదేవి  మరణించడం వెనుక ఏదో జరిగిందని ఆమె ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి మృతిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ తనకు తెలిసినంత వరకు దుబాయ్ సర్కారు పూర్తి స్థాయి నివేదిక ఇచ్చిందని.. అదికూడా తమకు అందినట్లు తెలిపారు. ఒకవేళ శ్రీదేవి మృతి వెనుక అనుమానించదగ్గ అంశాలు ఏమైనా ఉంటే ఇప్పటికల్లా బయటకు వచ్చేవని తెలిపారు. ఇక ఈ విషయంపై ఎలాంటి చర్చ అవసరం లేదని రవీష్ కుమార్ తేల్చి చెప్పేశారు. శ్రీదేవి సహజమరణమేనని ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments