Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి మృతిపై ఎలాంటి చర్చ అవసరం లేదు: భారత విదేశాంగ శాఖ

అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై జాతీయ మీడియా అనుమానం వ్యక్తం చేస్తూ పలు కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీదేవి మృతిపై నెలకొన్న అనుమానాలపై భారత విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. శ్రీదేవి

Webdunia
శనివారం, 10 మార్చి 2018 (08:25 IST)
అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై జాతీయ మీడియా అనుమానం వ్యక్తం చేస్తూ పలు కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీదేవి మృతిపై నెలకొన్న అనుమానాలపై భారత విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. శ్రీదేవి ఫిబ్రవరి 24వ తేదీన దుబాయ్‌లోని ఓ హోటళ్లో బాత్ ‌టబ్‌లో పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదవశాత్తు బాత్‌ టబ్‌లో పడి ఆమె మరణించినట్లు దుబాయ్ ఫోరెన్సిక్ రిపోర్టు వెల్లడించింది. ఆపై నాలుగు రోజుల తర్వాత ముంబైలో శ్రీదేవి అంత్యక్రియలు జరిగాయి. కానీ శ్రీదేవి మృతి పట్ల అభిమానుల్లో అనుమానాలున్నాయి. 
 
ఉన్నట్టుండి శ్రీదేవి  మరణించడం వెనుక ఏదో జరిగిందని ఆమె ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి మృతిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ తనకు తెలిసినంత వరకు దుబాయ్ సర్కారు పూర్తి స్థాయి నివేదిక ఇచ్చిందని.. అదికూడా తమకు అందినట్లు తెలిపారు. ఒకవేళ శ్రీదేవి మృతి వెనుక అనుమానించదగ్గ అంశాలు ఏమైనా ఉంటే ఇప్పటికల్లా బయటకు వచ్చేవని తెలిపారు. ఇక ఈ విషయంపై ఎలాంటి చర్చ అవసరం లేదని రవీష్ కుమార్ తేల్చి చెప్పేశారు. శ్రీదేవి సహజమరణమేనని ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments