Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇందిరమ్మ పాత్రలో నటించాలనుంది.. మనీషా కొయిరాలా

బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు బయోపిక్‌ల జోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనకి ఇందిరాగాంధీ పాత్రలో నటించాలనుందని బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా మనసులోని మాటను వెలిబుచ్చింది. అత్యంత శక్తివంతమై

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (14:40 IST)
బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు బయోపిక్‌ల జోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనకి ఇందిరాగాంధీ పాత్రలో నటించాలనుందని బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా మనసులోని మాటను వెలిబుచ్చింది. అత్యంత శక్తివంతమైన మహిళగా ఇందిరాగాంధీ కనిపిస్తారని, ఆమె పాత్రలో కనిపించేందుకు సిద్ధంగా వున్నానని మనీషా చెప్పింది. 
 
ఇందిరాగాంధీ పరిపాలనా కాలంలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు.. దేశ ప్రజలను ఆమె ప్రభావితం చేసిన తీరు అపూర్వమని మనీషా కొయిరాలా కొనియాడింది. ఆదర్శవంతమైన ప్రధానిగా వెండితెరపై కనిపించాలనేది తన చిరకాల కోరిక అని మనీషా చెప్పుకొచ్చింది. 
 
16 యేళ్ల క్రితమే తాను ప్రధాన పాత్రగా ఇందిరాగాంధీ బయోపిక్‌కి సంబంధించిన ప్రయత్నాలు జరిగాయి. ఎన్.చంద్ర దర్శకుడిగా కొంత హోమ్ వర్క్  జరిగిందంటూ మనీషా గుర్తు చేసుకుంది. మనీషా ప్రస్తుతం సంజయ్‌ దత్‌ బయోపిక్‌లో నర్గిస్ దత్ పాత్రలో కనిపిస్తోంది. మరి ఇందిరమ్మ సినిమాకు మనీషాను ఎంపిక చేసేందుకు దర్శకనిర్మాతలు ముందుకొస్తారో లేదో వేచిచూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ సంతకం చేయరు.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: భూమన సవాల్

విజయవాడ వరద నీటిలో తిరిగిన బాలుడు, కాటేసిన ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్, కాలు తీసేసారు

Best tourism villagesగా నిర్మల్, సోమశిల

ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ రూ. 20 కోట్ల సాయం

డిక్లరేషన్‌పై సంతకం పెట్టాల్సి వస్తుందనే జగన్ తిరుమల పర్యటన రద్దు : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments