Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేన్సర్‌ను జయించిన తర్వాతే జీవితం విలువ తెలిసింది : మనీషా కోయిరాలా

కేన్సర్‌ వ్యాధిని జయించిన తర్వాతే తనకు జీవితం విలువ తెలిసిందని బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా వ్యాఖ్యానించారు. ఒవేరియన్ కేన్సర్‌తో బాధపడిన మనీషా దానిని నుంచి బయటపడేందుకు చేసిన పోరాటం చూసి కేన్సరే వెనక్కి

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (09:01 IST)
కేన్సర్‌ వ్యాధిని జయించిన తర్వాతే తనకు జీవితం విలువ తెలిసిందని బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా వ్యాఖ్యానించారు. ఒవేరియన్ కేన్సర్‌తో బాధపడిన మనీషా దానిని నుంచి బయటపడేందుకు చేసిన పోరాటం చూసి కేన్సరే వెనక్కి తగ్గింది. కేన్సర్ నుంచి బయటపడ్డాక తిరిగి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన మనీషా... సంజయ్ దత్ బయో‌పిక్‌లో నర్గీస్ దత్ పాత్రలో నటించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, "కేన్సర్‌కు ముందు నా జీవితం అంత గొప్పగా ఏమీ లేదు. పెద్దగా పట్టించుకోలేదు కూడా. కానీ కేన్సర్‌తో బాధపడిన తర్వాత జీవితం గురించి తెలిసి వచ్చింది. చాలా కష్టాలు అనుభవించా. బోలెడంత డబ్బు ఖర్చు చేశా. అసంతృప్తి, బాధ, భయం నన్ను ఊపిరి పీల్చుకోనివ్వకుండా చేశాయి. అందుకే చెబుతున్నా.. జీవితాన్ని ఆనందించండి. దాని విలువను గుర్తించండి. మంచిగా బతకండి. ఎందుకంటే ఈ జీవితం మనకు దక్కిన ఓ బహుమతి" అని మనీషా వ్యాఖ్యానించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

14న ఏపీలో పిడుగులతో కూడిన వర్షమే వర్షం

పటాన‌చెరులో ప్రత్యక్షమైన పవన్ కళ్యాణ్!!

Supreme Court: కొమ్మినేనికి బెయిల్- సుప్రీం ఆదేశాలు చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిది: జగన్

Ahmedabad: భర్తను కలిసేందుకు లండన్‌కు వెళ్ళిన ఖుష్భూ.. తండ్రితో దిగిన చివరి ఫోటో వైరల్

Kommineni: ఏపీ సర్కారుకు సుప్రీం చీవాట్లు.. కొమ్మినేనికి బెయిల్- విడుదల చేయండి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments