Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మనసు మమత' టీవీ సీరియల్ నటి శ్రావణి బలవన్మరణం...

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (07:57 IST)
'మౌనరాగం', 'మనసు మమత' వంటి టీవీ సీరియల్స్‌లో నటించిన నటి శ్రావణి బలవన్మరణానికి పాల్పడింది. ఫ్రియుడి వేధింపులు భరించలేక ఆమె తన నివాసంలోనే ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ నగరంలోని మధురవాడలో నివాసం ఉంటోంది. అక్కడే గత రాత్రి బలవన్మరణానికి పాల్పడింది. 
 
ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. టిక్‌టాక్ ద్వారా ఇటీవల శ్రావణికి కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డితో పరిచయమైంది. స్నేహం కాస్తా ప్రేమకు దారితీసింది. 
 
తనకు తల్లిదండ్రులు లేరని చెప్పి శ్రావణికి మరింత దగ్గరయ్యాడు. డబ్బుల కోసం దేవరాజు వేధించేవాడని శ్రావణి కుటుంబ సభ్యులు తెలిపారు. అతడి వేధింపులు భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు.
 
శ్రావణిని ప్రేమిస్తున్నట్టు నమ్మించి ఆమెతో సన్నిహితంగా ఉంటూ దేవరాజ్ ఫొటోలు తీసుకున్నాడని, తర్వాత ఆ ఫొటోలు బయటపెడతానంటూ డబ్బులు డిమాండ్ చేశాడని పేర్కొన్నారు. అతడి వేధింపుల తీవ్రం కావడంతో ఇటీవల ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో శ్రావణి ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపారు.
 
అయినప్పటికీ వేధింపులు ఆపకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. శ్రావణి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్యకు కారణమైన దేవరాజ్‌ను కఠినంగా శిక్షించాలని శ్రావణి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments