టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకి అరుదైన గౌరవం.. అదేంటంటే?

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (15:08 IST)
సూపర్‌స్టార్ మహేశ్ బాబుకి మరో అరుదైన అవకాశం దక్కింది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఆయన మైనపు విగ్రహాన్ని రూపొందించింది. ఈ మైనపు విగ్రహాన్ని మార్చి 25న మహేశ్ స్వయంగా హైదరాబాద్‌లోని ఏఎంబి సినిమాస్ వేదికగా ఆవిష్కరించనున్నాడు. ఆ తర్వాత విగ్రహాన్ని సింగపూర్‌కి తరలించి అక్కడి టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచనున్నారు. 
 
టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు ఒక విగ్రహాన్ని సింగపూర్‌లో కాకుండా బయట ఆవిష్కరించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. మహేశ్‌కి దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మహేశ్ మహర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. 
 
దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తుండగా పూజా హెగ్దే ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. భరత్ అనే నేను చిత్రం భారీ విజయాన్ని నమోదు చేయడంతో మహర్షి సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఈ చిత్రం ఏప్రిల్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాష్ట్రంలో ప్రతిరోజూ 7,200 టన్నుల చెత్త: చెత్త శుద్ధి ప్లాంట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్

హ్యాక్ టు ది ఫ్యూచర్‌లో ఏఐ ఆధారిత పరిష్కారాలను రూపొందించిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

మోటార్లకు మీటర్లు అమర్చినా.. ఉచిత విద్యుత్ నిలిపివేసినట్టు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయం : సీఎం రేవంత్ సవాల్

మమతా బెనర్జీ మేనల్లుడుపై భౌతికదాడి.. రాళ్లు - కోడిగుడ్లు - చెప్పులతో...

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై నాన్ బెయిలబుల్ కేసు : అరెస్టు చేసిన పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై బ్లాక్ కిస్‌మిస్ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తిరుపతిలో క్యాన్సర్ విజృంభణను అడ్డుకోవడం: సంరక్షణ చర్యలను విస్తరిస్తోన్న ఎస్‌విఐసిసిఎఆర్

Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

తర్వాతి కథనం
Show comments