Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గీత గోవిందం' దర్శకుడితో మహేష్...

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (13:11 IST)
చేతులుకాలాక ఆకులు పట్టుకున్నట్లు... మహేష్ బాబు తన చేసిన 'బ్రహ్మోత్సవం', 'స్పైడర్' సినిమాలు ప్లాప్ అయిన తర్వాత తనతో సినిమా చేయాలనుకునే దర్శకులు ఎవరైనా పూర్తి స్క్రిప్టుతో వచ్చి, అది తనకు నచ్చితేనే సినిమా చేసేందుకు మహేష్ ఓకే చేస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. తన చేయబోయే సినిమా విషయంలో మహేష్ పాటిస్తున్న కఠిన నిబంధన ఇది. 
 
ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' చేస్తున్న మహేష్‌కి... దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా ఓకే అయింది. ఈ సంవత్సరం చివరి వరకు సినిమా పూర్తిచేసి వచ్చే యేడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది అనిల్ ప్లాన్. ఈ రెండింటి తర్వాత ఏ సినిమా చేస్తారు అనే విషయంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. 
 
రాజమౌళి దర్శకత్వంలో సినిమా ఉంటుందనే వార్తలు వచ్చినప్పటికీ... అవి ఎంతవరకు నిజమో తెలియదు. అయితే తాజాగా 'గీతగోవిందం' దర్శకుడు పరశురామ్ రీసెంట్‌గా మహేష్ బాబును కలిసి ఓ లైన్ వినిపించాడట. లైన్ బాగుంది డెవలప్ చేయమని చెప్పినట్టు తెలుస్తోంది. 
 
లైన్ డెవలప్ చేసి పూర్తి స్క్రిప్టుతో వచ్చి మహేష్‌ను మెప్పిస్తే.. సినిమా చేసే అవకాశం వస్తుంది. లేదంటే.. లేనట్టే. ఒకవేళ పరశురామ్ మహేష్‌ను ఒప్పించగలిగితే.. ఈ సెన్సేషనల్ జోడీ మరో సూపర్ హిట్ ఇవ్వనున్నారో... మొత్తం మీద ఏం జరగనుందో వేచి చూద్దాం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతల పరువునష్టం కేసు.. కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

గుమస్తా ఉద్యోగి నెల వేతనం రూ.15 వేలు.. ఆస్తులు రూ.30 కోట్లు

Anil Ambani: రూ.17,000 కోట్ల రుణ మోసం కేసు.. అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసిన ఈడీ

ఐదేళ్లలో మీరెంత తెచ్చారు? 14 నెలల్లో రూ. 45కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయ్: నారా లోకేష్

Byreddy Shabari: మహిళలు రాజకీయాల్లోకి వస్తారు.. ప్రత్యేక చట్టం కావాలి.. అలాంటి భాష వుండకూడదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments